
మురారి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సోనాలి బింద్రే. దాదాపు తెలుగు స్టార్ హీరోలందరి సరసన నటించిన ఆమె పెళ్లి అనంతరం సినిమాలకు దూరమయ్యారు. అంతేకాదు 2018లో ఆమె క్యాన్సర్ బారిన పడిన ఆమె న్యూయార్క్లో చికిత్స అనంతరం కోలుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో మురారి, మన్మధుడు, ఇంద్ర, ఖడ్గం, శంకర్ దాదా వంటి చిత్రాల్లో నటించిన సోనాలి చివరగా 2013లో ఒక బాలీవుడ్ సినిమాలో కనిపించి ఇండస్ట్రీకి దూరమయ్యారు.
సుమారు పదేళ్ల తర్వాత మళ్లీ రంగుల ప్రపంచంలోకి సోనాలి బింద్రే అడుగుపెట్టారు. ఈ క్రమంలో ఆమె పలు రియాలిటీ షోలలో జడ్జ్గా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ది బ్రోకెన్ న్యూస్ సీజన్ 2 వెబ్ సిరీస్లో కనిపిచనున్నారు. జీ5 వేదికగా మే3 నుంచి ఇది ప్రసారం కానుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా చాలా రోజుల తర్వాత ఆమె పలు ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా కూడా తన కుటుంబం కోసం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె.. 90వ దశకంలో టాప్ హీరోయిన్గా కొనసాగారు. కానీ 2013 నుంచి సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పడు ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చారు. అందుకు కూడా కారణం ఉందని ఆమె ఇలా చెప్పుకొచ్చారు. 'ఇప్పుడు నాకు కూడా డబ్బు అవసరం ఉంది. నేను చెల్లించాల్సిన బిల్లులు చాలా పెండింగ్లో ఉన్నాయి. అందుకోసం నేను పని చేయవలసి ఉంది. నా కుటుంబం కూడా చాలా క్లిష్టమైన ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అని ఆమె తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత తమ అభిమాన హీరోయిన్ మళ్లీ ఎంట్రీ ఇస్తున్నడంతో ఫ్యాన్స్ కూడా స్వాగతం పలుకుతున్నారు.
Sonali Bendre was photographed at the airport wearing an adorable dress. 😍❤️#sonalibendre pic.twitter.com/ImRGFQUBgL
— Manas Bollywood (@Manasbollywood) April 23, 2024