
కాలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీతో రూపొందిన చిత్రం ‘ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మీనన్, దిలీప్ హీరోలుగా, రాశీ సింగ్ హీరోయిన్గా నటించారు. తోట రామకృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతంపోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది.
‘‘పార్వతి దేవదాసుల ప్రేమకథకు ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఇప్పుడు ‘ఒక పార్వతి... ఇద్దరు దేవదాసులు’ టైటిల్తో ఓ విభిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించనున్నాం. ముఖ్యంగా యువతీ యువకులను అలరించేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. రఘుబాబు, కశి రెడ్డి రాజ్కుమార్, వీరశంకర్, గౌతం రాజు తదితరులు నటించిన ఈ సినిమాకు సంగీతం: మోహిత్ రహమానియాక్, కెమెరా: శ్రీనివాసరాజు.