
టాలీవుడ్ నుంచి త్వరలో రాబోతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'కన్నప్ప'. ఇదివరకే ప్రమోషన్స్ చేస్తున్నారు. శనివారం సాయంత్రం కొచ్చిలో.. నటుడు మోహన్ లాల్ చేతుల మీదగా ట్రైలర్ రిలీజ్ చేశారు. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇదే ఈవెంట్లో మోహన్ లాల్-మోహన్ బాబు మధ్య ఫన్నీ సంభాషణ జరిగింది. అలానే మోహన్ బాబు ఓ పెద్ద కోరికని బయటపెట్టారు. ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ హారర్ సినిమా)
'కన్నప్ప'లో మలయాళ సూపర్స్టార్ మోహన్ లాల్ అతిథి పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే తాజాగా కొచ్చిలో ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే మోహన్ లాల్ మాట్లాడుతుండగా.. మీ సినిమాలో తాను విలన్ చేస్తానని మోహన్ బాబుతో అన్నాడు. బదులుగా మీ మూవీలో తాను విలన్గా మోహన్ బాబు చెప్పుకొచ్చాడు. అలా అయితే తొలి సీన్లో మిమ్మల్ని కాల్చి పడేస్తానని మోహన్ లాల్ అనేసరికి స్టేజీపై ఉన్నవాళ్లంతా నవ్వుకున్నారు.
మరోవైపు ఇదే వేడుకలో మాట్లాడిన మోహన్ బాబు.. కేరళలో 'తుడరుమ్' చిత్రాన్ని 'కన్నప్ప' అధిగమించాలని తాను కోరుకుంటున్నట్లు మోహన్ బాబు తన మనసులో మాట బయటపెట్టారు. ఆ మూవీ కంటే ఒక్క రూపాయి ఎక్కువ 'కన్నప్ప'కు రావాలని తాను అనుకుంటున్నట్లు మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఏప్రిల్ చివర్లో రిలీజైన మోహన్ లాల్ 'తుడరుమ్'.. మలయాళంలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కేవలం కేరళలోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మరి మోహన్ బాబు చాలా పెద్దగా ఆశపడుతున్నారు. చూద్దాం మరి ఆయన కోరిక నెరవేరుతుందో లేదో?
(ఇదీ చదవండి: ఓటీటీలో మస్ట్ వాచ్ థ్రిల్లర్.. నరాలు తెగే ఉత్కంఠ.. 'స్టోలెన్' రివ్యూ)
#Mohanlal: You be the hero, I’ll play the villain in that film.#MohanBabu: No, I really want to act as a villain in your film, please...#Mohanlal: Then I’ll shoot and kill you in the first scene in that film!
— #Kannappa Event | Kochi pic.twitter.com/8fGqUsXGUc— Whynot Cinemas (@whynotcinemass_) June 14, 2025