
'మహావతార్ నరసింహ' సినిమా వంద కోట్ల క్లబ్లోకి చేరిపోయింది. ఈమేరకు తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా ఈ యానిమేటెడ్ చిత్రాన్ని తెరకెక్కించారు. జులై 25న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో మరిన్ని స్క్రీన్స్ పెంచుకుంటూ వెళుతున్నారు. బుక్మైషోలో ఇప్పటికే 25 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి.
'మహావతార్ నరసింహ' చిత్రం పదిరోజుల్లోనే రూ. 105 కోట్లు సాధించింది. భారత్లో విడుదలైన యానిమేషన్ చిత్రాలలో ఇదే అత్యధిక కలెక్షన్స్ కావడం విశేషం. ఆల్టైమ్ ఇండస్ట్రీ రికార్డ్గా చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. తెలుగులో గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజైంది.. ఈ సినిమాని విడుదల చేసేలా నరసింహ స్వామి అనుగ్రహించడం తన అదృష్టమని అల్లు అరవింద్ తెలిపారు. తెలుగులోనే ఏకంగా రూ. 20 కోట్లకు పైగా నెట్ రాబట్టినట్లు తెలుస్తోంది. హిందీలో రూ. 70 కోట్లకు పైగానే నెట్ కలెక్ట్ చేసినట్లు ఇండస్ట్రీ లెక్కలు చెబుతున్నాయి.
Roaring past records with divine force 🦁❤️🔥#MahavatarNarsimha crosses 105 CRORES+ GBOC India, setting the box office ablaze with unstoppable momentum.
A divine phenomenon awaits you in cinemas.#Mahavatar @hombalefilms @AshwinKleem @kleemproduction @VKiragandur @ChaluveG… pic.twitter.com/LbEdQBZyjo— Hombale Films (@hombalefilms) August 4, 2025