పాన్‌ ఇండియా చిత్రంగా ‘కాళీమాతా’ | Producer Kethireddy Jagadishwar Reddy Announces New Political Thriller ‘Kalimatha’ | Sakshi
Sakshi News home page

పాన్‌ ఇండియా చిత్రంగా ‘కాళీమాతా’

Nov 4 2025 12:35 PM | Updated on Nov 4 2025 2:21 PM

Kethireddy Jagadishwar Reddy Announced New Film Title As Kalimatha

ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు  కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి(Kethireddy Jagadishwar Reddy) కొత్త సినిమాను ప్రకటించాడు. నిజ సంఘటనల ఆధారంగా ‘కాళీమాతా’(Kalimatha)ని తెరకెక్కించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పొలిటికల్‌ థ్రిల్లర్‌ చిత్రానికి ఆయన కథను అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ని ప్రకటిస్తూ ఓ గ్లింప్స్‌ని విడుదల చేశారు. 

ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ.. ‘కాళీమాతా కేవలం సినిమా కాదు — ఇది ఒక ఉద్యమం.నిజ సంఘటనల స్ఫూర్తితో రూపొందుతున్న ఈ చిత్రం మతం, జాతి, భాష, ప్రాంతం అనే సరిహద్దులను దాటి — “సత్యానికి పాస్‌పోర్ట్ ఉండదు” అనే విశ్వసత్యాన్ని ప్రతిధ్వనింపజేస్తుంది. ఇది న్యాయం కోసం, సత్యం కోసం మానవత్వం చేసే ఆత్మపోరాటాన్ని ప్రతిబింబిస్తుంది.

ఈ చిత్రంలో పాన్‌ ఇండియా స్టార్స్‌ నటించబోతున్నారు. అలాగే ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు ఈ చిత్రంలో భాగమవుతున్నారు. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒడియాతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ విడుదల చేస్తాం. కాస్టింగ్‌తో పాటు పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’ అన్నారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement