దాడి కేసులో హీరోయిన్‌కు ముందస్తు బెయిల్‌ | Kerala High Court Grants Interim bail To Lakshmi Menon In Assault Case, Watch Video For More Details | Sakshi
Sakshi News home page

దాడి కేసులో హీరోయిన్‌కు ముందస్తు బెయిల్‌

Aug 28 2025 9:55 AM | Updated on Aug 28 2025 11:39 AM

Kerala Court Grants Interim bail To Lakshmi Menon

మలయాళ నటి లక్ష్మీ మేనన్‌ (Lakshmi Menon)కు కోర్టులో ఊరట లభించింది. ఆమెను అరెస్ట్‌ను తాత్కాలికంగా ఆపేయాలంటూ కేరళ కోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. సోషల్‌మీడియాలో లక్ష్మీ మేనన్‌ పేరు హాట్‌టాపిక్‌గా మారింది. కొచ్చిలోని ఐటీ ఉద్యోగిపై తన స్నేహితులతో కలిసి కిడ్నాప్‌ చేయడమే కాకుండా అతడిపై దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. దాడి చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేయగా నటి లక్ష్మీ మేనన్‌ పరారీలో ఉన్నారని వార్తలు వచ్చాయి.

లక్ష్మీ మేనన్‌పై కేసు నమోదు కావడంతో ఆమె ముందస్తు బెయిల్‌ కోసం కేరళ కోర్టును సంప్రదించారు. దీంతో న్యాయస్థానం కూడా ఆమెకు సానుకూలంగానే  ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్‌ 17వరకు ఆమెను అరెస్ట్‌ చేయకండి అంటూ పోలీసులను సూచించింది. అయితే, ఆమె స్నేహితులు మిథున్, అనీష్, సోనమోల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అసలు కారణం ఏంటి..?
లక్ష్మీ మేనన్‌ వివాదంలో పోలీసులు ఇలా చెప్పారు. 'ఓ బార్‌ వద్ద లక్ష్మీ మేనన్‌, ఐటీ ఉద్యోగి టీమ్‌ మధ్య మొదట వివాదం వచ్చింది. ఇరు గ్రూపుల మధ్య మాటకుమాట పెరిగింది. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతున్న ఐటీ ఉద్యోగిని లక్ష్మీ మేనన్‌తో పాటు ఆమె స్నేహితులు వెంబడించారు. ఆపై అతడిని దాడిచేశారు.  కేరళ కొచ్చికి చెందిన లక్ష‍్మీ మేనన్.. తమిళ, మలయాళంలో హీరోయిన్‌గా చేసింది. 2011 నుంచి సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది 'శబ్దం' అనే మూవీ చేసింది. గజరాజు, ఇంద్రుడు, చంద్రముఖి 2 లాంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఈమె కాస్త పరిచయమే.

Advertisement
 
Advertisement
Advertisement