Evaru Meelo Koteeswarulu: బ్రెయిన్‌ హీటెక్కుతుంది: రామ్‌చరణ్‌

Evaru Meelo Koteshwarulu: Ram charan And NTR Promo Out - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా ‘ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)’ఓ రియాల్టీ షో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  జెమినీ టీవీలో ఈ నెల 22 నుంచి ప్రసారం కానుంది. కాగా, ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టే తొలి ఎపిసోడ్‌కు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ గెస్ట్ గా విచ్చేసి సందడి చేయనున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ జెమిని టీవీ తాజాగా ఓ ప్రోమో విడుదల చేసింది.

తారక్‌, చెర్రీ ఓ రేంజ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ‘సీటూ హీటెక్కుతుంది.. బ్రెయినూ హీటెక్కుతుంది’ అంటూ చరణ్ టెన్షన్ పడడం, తారక్ అతనితో కలిసి సందడి చెయ్యడంతో ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ప్రతి సోమవారం నుంచి బుధవారం వరకు సాయంత్రం రాత్రి 8:30 గంటలకు ఈ షో టెలికాస్ట్‌ కానుంది.  'ఎవరు మీలో కోటీశ్వరులు' ప్రారంభ ఎపిసోడ్ (కర్టెన్ రైజర్)కు ముఖ్య అతిథి తన సోదరుడు రామ్ చరణ్  వచ్చాడని,  దీనికి సంబంధించిన షూటింగ్ జరిగిందని, ప్రేక్షకులకు ఎంతో వినోదం లభిస్తుందని ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top