
కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి
మెదక్ మున్సిపాలిటీ: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మెదక్ ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా ఎమ్మెల్యే ప్రవర్తన ఉండాలన్నారు. దిగజారే మాటలు మానుకోవాలని హితవు పలికారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన వారు ఎదుటివారి మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకొని ప్రజలకు ఇచ్చిన హామీ లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డికి ఫిర్యాదు చేశారు. సమావేశంలో మాజీ జెడ్పీ వైస్చైర్మన్ లావణ్యరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆత్మీయ సన్మానం
మెదక్ కలెక్టరేట్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద బదిలీపై వెళ్తున్న సందర్భంగా జిల్లా న్యాయశాఖ ఉద్యోగులు ఆదివారం పట్టణంలోని ఓ గార్డెన్లో ఆత్మీయ సన్మాన సభ నిర్వ హించారు. ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి ప్రధాన న్యాయమూర్తి సేవలను కొనియా డారు. అనంతరం న్యాయమూర్తిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సిరి సౌజన్య, స్పెషల్ మొబైల్ మెజిస్ట్రేట్ ప్రభాకర్, మెదక్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీరాములు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రం ప్రారంభం
రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీ పరిధిలోని గుల్పర్తి, కోమటిపల్లి గ్రామాల్లో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సహకార సంఘం చైర్మన్ బాదె చంద్రం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రజనికుమారి, వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు రాజ్నారాయణ, పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్రెడ్డి, ఇతర నాయకులు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి
పాపన్నపేట(మెదక్): కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని జిల్లా నాన్ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు జఫీరొద్దీన్, ఉపాధ్యక్షుడు రాకేష్ గోస్వామి, కార్యదర్శి భూమయ్య, మెదక్ టౌన్ అధ్యక్షుడు ముజీబ్ డిమాండ్ చేశారు. ఆదివారం పాపన్నపేటలో వారు విలేకరులతో మాట్లాడారు. డిమాండ్ల సాధన కోసం ఈనెల 25న జిల్లాలో నిర్వహించే ఆకలి కేకల రథయాత్రను జయప్రదం చేయాలని కోరారు. ఈనెల 27న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద జరిగే సమావేశానికి తరలిరావాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు

కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు

కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు