
ఆశాలపై వేధింపులు ఆపాలి
మెదక్జోన్: మాతా, శిశు సంక్షేమ ఆస్పత్రిలో ఆశావర్కర్లకు రెస్ట్ రూంను కేటాయించడంతో పాటు డాక్టర్లు, నర్సులు, హోంగార్డుల వేధింపులు ఆపాలని ఆశావర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు కడారి నర్సమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మెదక్ ఎంసీహెచ్ ఎదుట 4 గంటల పాటు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాతా, శిశు సంక్షేమ ఆసుపత్రికి గర్భిణులు, బాలింతలను ఆరోగ్య తనిఖీలు, డెలివరీలకు గ్రామాల నుంచి ఆశావర్కర్లు తీసుకొస్తారని తెలిపారు. ఆ సమయంలో 2 నుంచి 4 రోజులపాటు ఆస్పత్రి లోనే ఉండాల్సి వస్తుందన్నారు. ఆస్పత్రి సిబ్బ ంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఆశావర్కర్ల సమస్యలను వెంటనే పరి ష్కరించాలని, ఆస్పత్రిలో రెస్ట్రూం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరిస్తామని ఆస్పత్రి సూపరింటెండెంట్ కిరణ్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.