రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ సింగరేణి ఏరి యాస్పత్రిలో తొలిసారిగా టోటల్ హిప్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సను గురువారం విజయవంతంగా నిర్వహించారు. ఆస్పత్రి డీవైసీఎంవో డాక్టర్ మధుకుమార్ ఆధ్వర్యంలో ఆర్థోపెడిక్ వైద్యులు సుహాసిని, నరేశ్, అనస్తీషియా డాక్టర్ మైత్రేయి బృందం ఈ క్లిష్ట శస్త్రచికిత్సను పూర్తిచేశారు. శస్త్రచికిత్స పొందిన ఐలయ్య ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. ఇటీవల మోకాలి చిప్ప రిప్లేస్మెంట్ వి జయవంతంగా నిర్వహించిన ఆస్పత్రి వైద్యులు ఇ ప్పుడు మరో ఆపరేషన్ను విజయవంతం చేశారు. ఏరియాస్పత్రిలో ఆధునిక వైద్యసేవలను మరింత విస్తరిస్తున్నామని డీవైసీఎంవో పేర్కొన్నారు.


