● ఉమ్మడి జిల్లాకు సీఎం వరాలు
సభ వేదికపై తెలంగాణ రాష్ట్ర గేయాన్ని ఆలపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు
నిర్మల్: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన త ర్వాత తొలిసారి శుక్రవారం నిర్మల్ జిల్లా పర్యటన కు వచ్చిన రేవంత్రెడ్డి.. తొలి పర్యటనలోనే వరాలతో జిల్లా ప్రజల మనసు గెలుచుకున్నారు. ‘ఉమ్మడి ఆదిలాబాద్జిల్లా అంటే నాకు ప్రత్యేక అభిమానం. పీసీసీ అధ్యక్షుడిగా తొలి కార్యక్రమం 2021లో నిర్మల్లో చేపట్టినం. దళిత, గిరిజన దండోరా పేరిట మొదటి భారీసభ ఇంద్రవెల్లిలో నిర్వహించగా రెండూ భారీస్థాయిలో విజయవంతం చేశారు. ఇక్కడి ప్రజలు ఇచ్చిన భరోసానే సీఎంగా నిలిపింది. పోరాటం, పౌరుషానికి ప్రతీకై న ఈగడ్డపై పుట్టిన రాంజీగోండు, కుమురంభీం స్ఫూర్తితోనే తెలంగాణ సాధించుకున్నాం. అలాంటి ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాకు స్వరాష్ట్రంలో పదేళ్లు అన్యాయం జరి గింది. నా సొంతజిల్లా పాలమూరుతో సమానంగా ఈప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా..’ అంటూ ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు భరోసా ఇచ్చారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు పలువరాలు ప్రకటించారు. ఉమ్మడిజిల్లా పర్యటనలో భాగంగా మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించారు. జిల్లాలోని మామడ మండలం పొన్కల్ వద్ద గోదావరిపై నిర్మించిన సదర్మాట్ బ్యారేజీని ప్రారంభించారు. అనంతరం నిర్మల్లోని ఎన్టీఆర్ మినీస్టేడియంలో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతిబాట బహిరంగసభలో పాల్గొన్నారు.
బాసరలోనే యూనివర్సిటీ..
ఉమ్మడి జిల్లాలోని బాసరకు ఓ ప్రత్యేకత ఉందని, చదువుల తల్లి అక్కడ కొలువైందని, అందుకే అక్క డి ట్రిపుల్ఐటీలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామ ని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయం మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ప్రజలకు తమ ప్రాంతానికి యూనివర్సిటీ రాలేదన్న బాధ కలిగించి ఉండవచ్చు కానీ, వాయిదాలు పెట్టుకుంటూ పోతే ఏ ప్రాంతం కూడా అభివృద్ధి కాదని స్పష్టం చేశారు. యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ సహకరించాలని కోరారు. నిర్మల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి కోరిక మేరకు జిల్లాకేంద్రంలో స్టేడియం ఏర్పాటు చేస్తామని, మున్సిపల్ అభివృద్ధి, మాస్టర్ప్లాన్లో మార్పులు, కొత్త కలెక్టరేట్ మార్పులపైనా దృష్టిపెడతామని హామీ ఇచ్చారు. జిల్లాలో లక్ష ఎకరాలకు నీరందించాల్సిన కాళేశ్వరం 27, 28 ప్యాకేజీలనూ పూర్తిచేస్తామని తెలిపారు.
తుమ్మిడిహెట్టి కట్టి తీరుతాం
తుమ్మిడిహెట్టి వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. ఆదిలాబాద్కు గోదావరి జలా లు రావడం సాధ్యం కానందున తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహితపై ప్రాజెక్ట్ కట్టాలని నిర్ణయించామని చెప్పారు. ప్రాజెక్ట్ను నిర్మించి రెండు లక్షల ఎకరాలకు సాగునీరందించేలా సర్వేలు, నివేదికలు రెడీ అవుతున్నాయని వివరించారు.
సీఆర్ఆర్, నర్సన్నబాపుల పేర్లు..
సీనియర్ నేతలుగా, తమ ప్రాంతాలను అభివృద్ధి చేసినవారిగా ప్రజల్లో నిలిచిన మాజీ మంత్రి పొద్దుటూరి నర్సారెడ్డి(నర్సన్నబాపు), ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే ిసీ రాంచంద్రారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. చనాక–కొరాట పంప్హౌస్కు రాంచంద్రారెడ్డి పేరు, సదర్మాట్ బ్యారేజీకి పీ నర్సారెడ్డి పేర్లు పెడుతున్నట్లు నిర్మల్ సభావేదిక మీదుగా సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.
నిర్మల్ సభకు హాజరైన జనం
సదర్మాట్ బ్యారేజీ వద్ద పూజలు చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు
ఆదిలాబాద్లో అతిపెద్ద పారిశ్రామికవాడ
ఎర్ర బస్సు కూడా రాని గూడేలున్న ఆది లాబాద్ జిల్లాకు ఎయిర్ బస్సు తీసుకువస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. త్వరలోనే ఎయిర్పోర్టును పూర్తిచేస్తామని పేర్కొన్నారు. ఎయిర్పోర్టు, యూని వర్సిటీలుంటే సరిపోద ని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, వేలాదిమందికి ఉపాధి లభించాల న్నా పరిశ్రమలు అవసరమని చెప్పారు. ఆదిలాబా ద్ జిల్లాలో 10 వేల ఎకరాలతో అతిపెద్ద పారిశ్రామికవాడను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దేశంలోని ప్రతీ పరిశ్రమ ఇక్కడ ఉంటుందన్నారు. ఆదిలా బాద్లో త్వరలోనే ప్రధాని మోదీతో ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేయిస్తామని తెలి పారు. ఎయిర్పోర్టు, పరిశ్రమలతోపాటు ఆదిలాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు.
● ఉమ్మడి జిల్లాకు సీఎం వరాలు
● ఉమ్మడి జిల్లాకు సీఎం వరాలు
● ఉమ్మడి జిల్లాకు సీఎం వరాలు
● ఉమ్మడి జిల్లాకు సీఎం వరాలు


