రెండేళ్లవుతున్నా హామీ నిలబెట్టుకోలేదు
మాకు సొంత భూమి నాలుగు ఎకరాలు ఉంది. మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నాం. నాకు వ్యక్తిగతంగా తైవాన్ స్ప్రేయర్లు అవసరం ఉంది. వీటిని 50 శాతం సబ్సిడీపై వెంటనే పంపిణీ చేయాలి. 2024లో జరిగిన ఎన్నికల సమయంలో వ్యక్తిగత పనిముట్లు పెద్ద ఎత్తున పంపిణీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రెండేళ్లవుతున్నా ఈ హామీ నిలబెట్టుకోలేదు. నిజమైన రైతులను గుర్తించి యంత్ర పరికరాలు పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికై నా ఈ దిశగా చర్యలు తీసుకోవాలి.
– సయ్యద్ హుసేన్ బాషా, రామాపురం, తుగ్గలి మండలం


