
నాణ్యత ‘తారు’మారు
కోడుమూరు రూరల్ : పల్లెపండుగ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గత జనవరి నెలలో హడావుడిగా చేపట్టిన రోడ్ల మర మ్మతులను చూసి ప్రజలు నవ్వుతున్నారు. కోడు మూరు మండలంలోని అనుగొండ నుంచి వెంకటగిరి వరకు ప్యాచ్ వర్క్లకు రూ.4లక్షలు, అనుగొండ నుంచి అల్లినగరం మీదుగా లద్దగిరి వరకు రోడ్డు ప్యాచ్వర్క్ల కోసం రూ.3.50లక్షలను కేటాయించారు. రోడ్లు గుంతలు పడిన ప్రాంతంలో మట్టితో కూడిన కంకర వేసి వాటిపై రోలర్ తిప్పకుండానే తారు వేసేశారు. దీంతో ఆరు నెలలు కూడా గడవకముందే పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షాలకు తారు లేచిపోవడంతో రోడ్డంతా యథావిధిగా గుంతలమయంగా తయారైంది. ఇలాంటి రోడ్ల మరమ్మతులు తామెన్నడూ చూడలే దని, ఇంత నాసిరకంగా పనులు చేస్తే ఎలా అంటూ ఆయాగ్రామాల ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.