మా స్కూల్‌ మాకే ఉంచాలి | Students And Parents Protest In Nandyal District Mandlem Over School Merging Issue | Sakshi
Sakshi News home page

మా స్కూల్‌ మాకే ఉంచాలి

Jun 20 2025 6:01 AM | Updated on Jun 20 2025 8:53 AM

Students and parents protest in Mandlem, Nandyal district

మండ్లెం వద్ద జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు

నంద్యాల జిల్లా మండ్లెంలో విద్యార్థులు, తల్లిదండ్రుల నిరసన

జూపాడు బంగ్లా: ‘మా కాలనీలోని స్కూల్‌ను మాకే ఉంచాలి... మరో పాఠశాలలో విలీనం చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడితే సహించేది లేదు...’ అంటూ నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మండ్లెం గ్రామ విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కారు. మండ్లెం గ్రామ దళితకాలనీలో ఉన్న స్పెషల్‌ ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను రెండు కిలోమీటర్ల దూరంలో కేజీ రోడ్డు పక్కన ఉన్న మెయిన్‌ ప్రాథమిక పాఠశాలలో విలీనం చేశారు. 

దీన్ని రద్దు చేయాలని గురువారం విద్యార్థులు, తల్లిదండ్రులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. పిల్లలను ఆ బడికి ఎలా పంపాలి? రహదారి దాటుతుండగా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కాలనీలో పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement