
బీహార్ సర్పంచ్ల బృందం సందర్శన
కర్నూలు(రూరల్)/పాణ్యం: గార్గేయపురం, కౌలూరు గ్రామాలను శుక్రవారం బీహార్ సర్పంచ్ల బృందం సందర్శించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంటు హైదరా బాద్ వారి అధ్వర్యంలో దాదాపు 55 మంది ఆయా గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, గ్రామ సచివాలయ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, గ్రామం నుంచి సేకరించే తడి, పొడి చెత్త నుంచి తయారు అయ్యే సేంద్రి య ఎరువు యూనిట్ను పరిశీలించారు. ప్రజలకు ప్రభు త్వం అందజేస్తున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఎన్ఐఆర్డీ అధికారిణి ప్రత్యుష్ణ పట్నాయక్, గార్గేయపురం సర్పంచ్ సోమేశ్వరమ్మ, ఈఓఆర్డీ చంద్రమౌళీశ్వరగౌడ్, జిల్లా ప్రాజెక్టు రిసోర్సుశిక్షకులు గిడ్డయ్య తదితరులు ఉన్నారు.