పార్టీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు అనగాని చైతన్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ మోసాల కారణంగా యువతకు ఉద్యోగాలపై నమ్మకం కోల్పోయిందన్నారు. వెంటనే డీఎస్సీ మెరిట్ లిస్టును బహిర్గతం చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. మెరిట్లిస్ట్ బహిర్గతం చేయకుండా కావాలనే అధికారులతో తప్పుడు సమాచారం ఇప్పిస్తున్నారని, దీని వల్ల డీఎస్సీ అర్హులైన అభ్యర్థులు నష్టపోతున్నారన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.


