
683 మంది సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): పాలిసెట్ –2025లో ర్యాంకులు పొందిన విద్యార్థుల సర్టిఫి కెట్ల పరిశీలన ప్రక్రియ బుధవారం కూడా కొనసాగింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు–216 మంది, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని కేంద్రంలో–247 మంది, ఆంధ్రా లయోల కళాశాల ఆవరణలోని కేంద్రంలో–220 మంది జనరల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. మొత్తం 683 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి ధ్రువీకరణ పత్రాలను అందజే శామని పాలిసెట్–2025 ఎన్టీఆర్ జిల్లా కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి తెలిపారు.
నేటి షెడ్యూల్ ఇదీ..
● స్పెషల్ కేటగిరీకి సంబంధించి గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో ఎన్సీసీలో 40,001 నుంచి 80 వేల ర్యాంకు వరకు, స్పోర్ట్స్ కేటగిరీలో ఒకటి నుంచి 60 వేల లోపు ర్యాంకు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. జనరల్ కేటగిరీకి సంబంధించి మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 86,001 నుంచి 95 వేల లోపు ర్యాంకు వరకు, ఆంధ్రా లయోల డిగ్రీ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 95,001 నుంచి లక్షా నలభై వేల లోపు ర్యాంకు పొందిన వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తారు.