ప్రశాంతంగా ముగిసిన ప్రవేశ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ముగిసిన ప్రవేశ పరీక్ష

Jun 26 2025 6:10 AM | Updated on Jun 26 2025 12:08 PM

జి.కొండూరు: ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా గురుకుల బాలికల పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు కుంటముక్కల సాంఘి క సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షను జి.కొండూరు మండల విద్యాశాఖ అధికారి వీరాస్వామి పర్యవేక్షించారు. పాఠశాల హెచ్‌ఎం కె.బ్యూలా మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో తొమ్మిది గురుకుల బాలికల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఆరో తరగతిలో ప్రవేశానికి 604 మంది విద్యార్థినులు దరఖాస్తు చేయగా 419మంది పరీక్షకు హాజరయ్యారన్నారు. అదేవిధంగా ఏడో తరగతిలో ప్రవేశం కోసం 513 మంది దరఖాస్తు చేయగా 425మంది, ఎనిమిదో తరగతిలో ప్రవేశానికి 480మంది దరఖాస్తు చేయగా 460 మంది, తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి 472మంది దరఖాస్తు చేయగా 412మంది విద్యార్థినులు పరీక్షకు హాజరైనట్లు చెప్పారు.

విశ్వనాథరెడ్డికి డాక్టరేట్‌ ప్రదానం

చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా విశ్వవిద్యాలయం 6, 7, 8 స్నాతకోత్సవ కార్యక్రమంలో ‘సాక్షి’ స్టేట్‌ బ్యూరో చీఫ్‌ మల్లు విశ్వనాథరెడ్డి పీహెచ్‌డీ పట్టాను అందుకున్నారు. జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో ఆయన పలు పరిశోధనలు చేసి విశ్వవిద్యాలయంలో వాటిని నివేదికలను అందజేసి పీహెచ్‌డీను సాధించారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ పీహెచ్‌డీ సర్టిఫికెట్‌ను గౌరవ డాక్టరేట్‌ ప్రధానకర్తలు మండవ ప్రభాకరరావు, ఎంఎన్‌వీ రవికుమార్‌, చలమలశెట్టి అనిల్‌కుమార్‌, యూనివర్సిటీ రెక్టార్‌ బసవేశ్వరరావు చేతుల మీదుగా విశ్వనాథరెడ్డి అందుకున్నారు.

5న జాతీయ లోక్‌అదాలత్‌

చిలకలపూడి(మచిలీ పట్నం): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జూలై 5వ తేదీన జాతీయ లోక్‌ అదా లత్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుత్తల గోపీ తెలిపారు. ఈ లోక్‌ అదాలత్‌లో రాజీ పడదగిన క్రిమినల్‌ కేసులు, చెక్‌బౌన్స్‌ కేసులు, మోటారు వాహన ప్రమాద క్లయిమ్‌లు అన్ని రకాల సివిల్‌ కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు. సంబంధిత కక్షిదారులు తమ న్యాయవాదులను సంప్రదించి లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, నూజివీడు, నందిగామ, అవనిగడ్డ, కై కలూరు, గన్నవరం, తిరువూరు, జగ్గయ్యపేట, బంటుమిల్లి, మైలవరం, ఉయ్యూరు, మొవ్వ కోర్టుల్లో ఈ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తామన్నారు. కక్షిదారులు లోక్‌ అదాలత్‌లో కేసులు సిఫార్సు చేయించుకుని సమయం వృఽథా కాకుండా చూసుకోవాలన్నారు.

వైఎస్సార్‌ సీపీలో నియామకాలు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన పలువురిని పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాలలో నియమించారు. పార్టీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శులుగా నంబూరి రవి (జగ్గయ్యపేట), వెన్నం రత్నారావు (విజయవాడ సెంట్రల్‌), రాష్ట్ర ఆర్టీఐ విభాగం కార్యదర్శిగా మల్లెల వెంకట చిన్నారెడ్డి(విజయవాడ ఈస్ట్‌), రాష్ట్ర బూత్‌ కమిటీ వింగ్‌ ప్రధాన కార్యదర్శి షేక్‌ హసన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

నేటి నుంచి మహిళా సర్పంచ్‌లకు శిక్షణ

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, గ్రామ పరిపాలన విధానాలపై మహిళా సర్పంచ్‌లకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బాపులపాడు ఇన్‌చార్జి ఎంపీడీవో త్రినాథ తిరుమలరావు బుధవారం తెలిపారు. ఈ నెల 26వ తేదీ నుంచి 28 వరకు బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు మండలాల్లోని మహిళా సర్పంచ్‌లకు గుడివాడ మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో శిక్షణ ఉంటుందని చెప్పారు.

ప్రశాంతంగా ముగిసిన ప్రవేశ పరీక్ష1
1/1

ప్రశాంతంగా ముగిసిన ప్రవేశ పరీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement