
ముంపు.. ముప్పు..
బుడమేరు పరీవాహక ప్రాంతం కావడంతో తరచూ వరదలు వచ్చిన సమయంలో నష్టపోతున్నారు. ముఖ్యంగా గతేడాది సెప్టెంబర్లో సంభవించిన బుడమేరు వరద రైతుల కంట కన్నీరు మిగిల్చింది. రైతులు ఆరుగాలం శ్రమించి ఎకరాకు రూ.20వేల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట వరద ధాటికి పూర్తిగా కొట్టుకుపోవడంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. ఒక్క గింజ చేతికి వచ్చిన పాపాన పోలేదు. ఇలపర్రు, కుదరవల్లి, రామాపురం రెవెన్యూ పరిధుల్లో దాదాపుగా 700ఎకరాలకు పైగా అనాధీన భూమి సాగవుతోంది. భూముల్లో వేసిన పంట పూర్తిగా నాశనం కావడంతో రైతులు నట్టేట మునిగారు.