
అమెరికా యుద్ధోన్మాదాన్ని ఖండించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అమెరికా సామ్రా జ్యావాదాన్ని, యుద్ధోన్మాదాన్ని ఖండించాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి. అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదాన్ని ఖండించాలని కోరుతూ సీపీఐ, సీపీఎం ఇతర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో ప్రదర్శన జరిగింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లా డుతూ.. యుద్ధం ముగిసిందని కొందరు అనుకుంటున్నారని, కాల్పుల విరమణ కేవలం తాత్కాలికమేనని అన్నారు. మూడు నెలలుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే అమెరికా, ఇజ్రాయిల్ తమ ఇష్టానుసారం ఏ దేశం మీద పడితే ఆ దేశం మీద అడ్డగోలుగా దాడులు చేస్తున్నాయని విమర్శించారు. అమెరికా, ఇజ్రాయిల్ తప్ప మరే దేశం అణ్వాయుధాలే కాదు అణుశక్తి కూడా కలిగి ఉండకూడదని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తున్నట్లు నిర్ధారణ కాకున్నా అమెరికా, ఇజ్రాయిల్ భయంకర ఆయుధాలు ప్రయోగించి వందల మందిని పొట్టనబెట్టుకున్నాయని వివరించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అమెరికా, ఇజ్రాయిల్కు కొమ్ముకాస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, నగర కార్యదర్శి కె.కోటేశ్వరరావు, వామ పక్ష నాయకులు వై.వెంకటేశ్వరరావు, కె.వి.వి.ప్రసాద్, పెన్మత్స దుర్గాంబ తదితరులు పాల్గొన్నారు.