ఆయిల్‌ పామ్‌ తోటల్లో ఎలుకల నివారణపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ పామ్‌ తోటల్లో ఎలుకల నివారణపై అవగాహన

Jun 25 2025 7:14 AM | Updated on Jun 25 2025 7:14 AM

ఆయిల్‌ పామ్‌ తోటల్లో ఎలుకల నివారణపై అవగాహన

ఆయిల్‌ పామ్‌ తోటల్లో ఎలుకల నివారణపై అవగాహన

ఘంటసాల: ఆయిల్‌ పామ్‌ పంటల్లో ఎలుకల ఉద్ధృతి తగ్గించుకోవడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు చెప్పే సూచనలు, సలహాలు రైతులు పాటించాలని కృష్ణాజిల్లా ఉద్యాన శాఖ అధికారి జె.జ్యోతి అన్నారు. జిల్లా ఉద్యాన శాఖ, ఉండవల్లి ఆగ్రోస్‌ ఎల్‌.ఎల్‌.పి. ఆధ్వర్యంలో ఘంటసాల కేవీకే సమన్వయంతో ఆయిల్‌ పామ్‌ తోటల్లో ఎలుకల నివారణపై రైతులకు అవగాహన సదస్సు ఘంటసాల సత్యసాయి మినీ కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీకే సమన్వయకర్త డాక్టర్‌ సుధారాణి మాట్లాడుతూ ఆయిల్‌ పామ్‌తో పాటు అన్ని పంటల్లో ఎలుకల నివారణకు రైతులంతా సామూహికంగా చేపట్టాలన్నారు. ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్‌ వి.మంజువాణి మాట్లాడుతూ ఆయిల్‌ పామ్‌ పంటల్లో పోషక, నీటి యాజాన్యం, మాగాణుల్లో వేసుకున్న పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి జె.జ్యోతి మాట్లాడుతూ ఉద్యాన శాఖ ద్వారా ఘంటసాల, చల్లపల్లి, మొవ్వ, పామర్రు, గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో ఉండవల్లి ఆగ్రోస్‌ ఎల్‌.ఎల్‌.పి., ఎఫ్‌3 సంస్థలతో ఆయిల్‌ పామ్‌ పండించే రైతులకు నూరు శాతం రాయితీపై మొక్కలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఎకరానికి 57 మొక్కలు, హెక్టారుకు 143 మొక్కలు చొప్పున ఇస్తున్నామని, వాటిని నాటే సమయంలో మొక్కల మద్య 9 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉండవల్లి ఆగ్రోస్‌ డీజీఏం బి.హరికృష్ణ, 3ఎఫ్‌ ఆయిల్‌ పామ్‌ సీనియర్‌ మేనేజర్‌ యు.విక్రమ్‌రాజు, పామర్రు ఉద్యాన శాఖ అధికారి జె.కీర్తిదేవ్‌, కేవీకే శాస్త్రవేత్త డాక్టర్‌ రేవతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement