యోగా నిత్య జీవితంలో ఓ భాగం కావాలి | - | Sakshi
Sakshi News home page

యోగా నిత్య జీవితంలో ఓ భాగం కావాలి

Jun 24 2025 4:21 AM | Updated on Jun 24 2025 4:21 AM

యోగా నిత్య జీవితంలో ఓ భాగం కావాలి

యోగా నిత్య జీవితంలో ఓ భాగం కావాలి

మచిలీపట్నంటౌన్‌: యోగా ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో ఓ భాగం కావాలని కృష్నా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఏపీ యోగసభ ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్‌లోని ఉదయపు నడక మిత్రమండలి భవనంలో సోమవారం యోగా గురువు మద్దాల చింతయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా శిక్షణ తరగతుల్లో కలెక్టర్‌ పాల్గొని సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, యోగాసనాలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం మే నెల 21వ తేదీ నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం ఈ నెల 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవంతో ముగిసిందన్నారు. యోగా కార్యక్రమం అధికారికంగా ముగిసినప్పటికీ యోగా సాధన మన నిత్యజీవితంలో ఓ భాగం చేసుకుని నిరంతరం కొనసాగించాలని సూచించారు. మచిలీపట్నం నగరంలో ఏపీ యోగాసభ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోనే కాకుండా చింతగుంటపాలెం, కాస్మోపాలిటన్‌ క్లబ్‌, గొడుగుపేట, శంకరమఠంలో కూడా ఉచితంగా యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement