
అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి
చిలకలపూడి(మచిలీపట్నం): అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్కు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలని అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రమాదేవి కోరారు. సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. రమాదేవి మాట్లాడుతూ అంగన్వాడీలందరూ పేద కుటుంబాలకు చెందిన వారని ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదైనందు వల్ల సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదన్నారు. అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు తల్లికి వందనం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. అంగన్వాడీలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగలేదని అందుకోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు సర్క్యులర్ జారీ చేయాలన్నారు. అనంతరం డీఆర్వో కె.చంద్రశేఖరరావు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి బూర సుబ్రహ్మణ్యం, సీహెచ్ జయరావుతో పాటు అంగన్వాడీల సంఘం నాయకులు ఎం.నిర్మలజ్యోతి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.