
డీసీఎంఎస్ చైర్మన్గా రామకృష్ణ బాధ్యతల స్వీకారం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కృష్ణాజిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) చైర్మన్గా బండి రామకృష్ణ శుక్రవారం విజయవాడ సూర్యారావుపేటలోని డీసీఎంఎస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కార్యాలయ అధికారులతో సమావేశమయ్యారు. డీసీఎంఎస్ పరిధిలో ఉన్న భూములు, గిడ్డంగులు, మూల నిధులు, రావాల్సిన నిధుల గురించి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం పని చేస్తుందని, అన్నదాతకు మేలు చేసే విధంగా సొసైటీని తీర్చిదిద్దుతామన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు అతి తక్కువ ధరకు లభ్యమయ్యేలా సొసైటీ పరిధిలో నూతన దుకాణాలను 15 రోజుల్లో ఏర్పాటు చేసి అన్నదాతకు మేలు జరిగేలా చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో బిజినెస్ మేనేజర్ యు.వి.ప్రసాద్ రావు, మేనేజర్ ఆర్. రమేశ్ బాబు, వి.సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తదితరులు పాల్గొన్నారు.