
రైతులకు మెరుగైన సేవలు అందించాలి
మచిలీపట్నంటౌన్:కృష్ణా జిల్లా సహకార మార్కిటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బండి రామకృష్ణ ఆ సంస్థ ద్వారా జిల్లాలోని రైతులకు మెరుగైన సేవలు అదించాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు. డీసీఎంఎస్ చైర్మన్గా నగరానికి చెందిన బండి రామకృష్ణ బుధవారం రాత్రి ఓ కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా రైతులకు సేవలందంచేందుకు ఈ పదవి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. రామకృష్ణ మాట్లాడుతూ తనపై నమ్మకముంచి ఇచ్చిన ఈ బాధ్యతల్ని కష్టపడి పని చేస్తూ రైతులకు సేవలు అందిస్తానని చెప్పారు. అనంతరం రామకృష్ణను పలువురు శాలువాలు, పూల మాలలు, బొకేలతో సత్కరించారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావ్, వెనిగండ్ల రాము, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ముడా చైర్మన్ మట్టా ప్రసాద్, బీసీ సంఘ రాష్ట్ర నాయకుడు కొనకళ్ల బుల్లయ్య, మార్కెట్యార్డ్ చైర్మన్ కుంచే నాని, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, జిల్లా ఆస్పత్రి మాజీ చైర్మన్ తలారి సోమశేఖర్, జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డం రాజు, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
డీసీఎంఎస్ చైర్మన్గా
బండి రామకృష్ణ బాధ్యతల స్వీకరణ