
మోపిదేవిలో కలెక్టర్ బాలాజీ పర్యటన
మోపిదేవి: మండలంలో పలు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం తనిఖీలు నిర్వహించారు. మోపిదేవి సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని సందర్శించి అభివృద్ధి పనులు పరిశీలించారు. బాత్రూముల డోర్లు పర్మినెంట్గా ఉండేవి ఏర్పాటు చేయాలని, త్వరితగతిన భవన నిర్మాణం పూర్తిచేయాలని అదికారులకు సూచించారు. రావివారిపాలెంలో పీహెచ్సీని సందర్శించి రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో మందుల విభాగాన్ని, ప్రయోగశాలను తనిఖీ చేశారు. గదులు చాలక రోగులు ఇబ్బంది పడుతున్నారని ఎంపీపీ దుర్గావాణి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. పాముకాటుకు విరుగుడు మందు, రాబిస్ వ్యాధి మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వెంకటాపురంలో గ్రామ సచివాలయాన్ని సందర్శించి భూ రీ సర్వేపై గ్రామస్తులతో మాట్లాడారు. 11/1 కాలువ చివరలో పూర్తిగా పూడుకు పోయినందున కాలువ చివరి భూములకు నీరు అందడం లేదని పలువురు రైతులు కలెక్టర్కు తెలిపారు. స్థానిక జెడ్పీపాఠశాల, ఆంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. చిన్నారులకు మంచి పౌష్టికాహారం కలిగిన ఆహారం అందించాలని ఆదేశించారు. ఎంపీపీ రావి దుర్గావాణి, అదనపు డీఎంహెచ్వో వెంకటరావు, తహసీల్దార్ శ్రీవిద్య, ఎంపీడీవో స్వర్ణభారతి, సీహెచ్సీ డాక్టర్లు అనిల్కుమార్, లక్ష్మీనాఽథ్, వార్డెన్ నాగలక్ష్మీ, మాజీ సర్పంచ్ అబ్బూరి నాంచారయ్య, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.