
ఆరోగ్య‘యోగా’న్ని వదలొద్దు
కలెక్టర్ డీకే బాలాజీ
మోపిదేవి: యోగాతో జీవిత కాలం ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మండల కేంద్రం మోపిదేవి జెడ్పీ పాఠశాల ఆవరణలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ చిన్న తనం నుంచి యోగా అలవాటు చేసుకోవడం వల్ల జీవితకాలం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. నిత్యం యోగా చేయడం వల్ల దేహం రబ్బరు మాదిరి వంగే గుణం ఉంటుందని తద్వారా ఆరోగ్య ప్రయాజనాలు చేకూరుతాయని వివరించారు. జిల్లా ఎస్పీ గంగాధరరావు మాట్లాడుతూ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలంటే యోగాను జీవనశైలిలో తప్పని సరిగా భాగం చేసుకోవాలన్నారు.
ఆకట్టుకున్న నృత్య
ప్రదర్శన..
తొలుత ప్రత్యేక యోగా శిక్షకులు రెబ్బా శాస్త్రి నమస్కార ముద్ర ప్రార్థన గీతంతో ప్రారంభించి యోగాసనాలు వేయించి ప్రతిజ్ఞ చేయించారు. యార్లగడ్డ విద్యార్థులు యోగా విన్యాసాలతో చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు, కృష్ణాజిల్లా విశ్వవిద్యాలయం ఉపకులపతి కె. రాంజీ, మచిలీపట్నం ఆర్డీవో కె. స్వాతి, డీఎస్పీ విద్యశ్రీ, విజిలెన్స్ డెప్యూటీ కలెక్టర్ పోతురాజు, జిల్లా పర్యాటకశాఖ అధికారి జి. రామ లక్ష్మణరావు, మెప్మా పీడీ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.