
శ్రీభ్రమర హోమ్స్ నూతన వెంచర్ ప్రారంభం
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు):శ్రీ భ్రమర హోమ్స్ సంస్థ విజయవాడ నగరానికి సమీపంలోని ఆకునూరు దగ్గర శ్రీ భ్రమర హోమ్స్ పేరుతో కొత్త ప్రాజెక్టుకు ప్రారంభించారు. స్థానిక బెంజ్సర్కిల్ సమీపంలోని ఒక ఫంక్షన్ హల్లో శ్రీ భ్రమర హోమ్స్ గ్రాండ్ ప్రీ–లాంచ్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. శ్రీ భ్రమర హోమ్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గళ్ళా రామచంద్రరావు ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక సౌకర్యాలతో పాటు వంద శాతం క్లియర్ టైటిల్, పక్కా వాస్తుతో అందరికీ అందుబాటుగా ఉండేలా వీటిని ప్రణాళికాబద్దంగా తీర్చిదిద్దామని చెప్పారు. శ్రీ భ్రమర చేపట్టిన ప్రాజెక్టు ‘శ్రీ భ్రమర హోమ్స్’లో విల్లాస్, విల్లా ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు మారం చంద్రశేఖర్, ఎంఎస్ రాజు, ఎంపీకే లక్ష్మీపతి రాజు, శైలారెడ్డి కోట, యడ్లపల్లి మురళీకృష్ణ, రావెల గోపాలకృష్ణ, గుండేటి శివ, గుండా సుబ్బారావు, జమిలి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
గుడివాడరూరల్: వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియాన్ని పట్టుకున్నామని తాలూకా ఎస్ఐ ఎన్.చంటిబాబు సోమవారం తెలిపారు. మల్లాయపాలెం సమీపంలోని బైపాస్రోడ్డులో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో మినీ వ్యాన్ను తనిఖీ చేశామని చెప్పారు. 34 బస్తాల్లో తరలిస్తున్న 1700 కిలోల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బియ్యంతో పాటు, వాహనాన్ని సీజ్ చేశామని పేర్కొన్నారు. పామర్రుకు చెందిన వ్యాన్ డ్రైవర్ యండమూరి సీతారాముడును అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కొత్తపేటకు చెందిన పెద్ది రామచంద్రరరావు అదుపులోకి తీసుకున్నామని వివరించారు. రేషన్ కొనుగోలు చేసి వ్యాపారం చేసే వ్యవహారంలో ప్రధాన నిందితుడైన పెద్ది అర్జునరావును ఇంకా అదుపులోకి తీసుకోలేదని, వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తామని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. రేషన్ వ్యాపారం చేసే నిందితుడు అధికార పార్టీకి చెందిన నాయకుడు కావడం వల్ల పోలీసులపై ఒత్తిడి వచ్చే అవకాశం ఉందని కొత్తపేట వాసులు పేర్కొంటున్నారు.

శ్రీభ్రమర హోమ్స్ నూతన వెంచర్ ప్రారంభం