
వడి బియ్యంకు కిలో రూ.21.05
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు భక్తులు సమర్పించే వడి బియ్యంకు కిలో రూ. 21.05 చొప్పున చెల్లించేందుకు కాంట్రాక్టర్కు ముందుకు వచ్చారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన వడి బియ్యం, నూనె డబ్బాల బహిరంగ వేలం పక్రియ సోమవారం మహా మండపం ఆరో అంతస్తులో నిర్వహించారు. ఏసీ రంగారావు పర్యవేక్షణలో ఏఈవోలు ఎన్. రమేష్బాబు, వెంకటరెడ్డి వేలం పక్రియ నిర్వహించారు. ముగ్గురు కాంట్రాక్టర్లు వేలంలో పాల్గొన్నారు. వడిబియ్యంకు ప్రథమ ధరావతుగా రూ. 50 వేలు చెల్లించి వేలంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం హనుమకొండకు చెందిన ఎన్.సంతోష్ వడిబియ్యంకు కిలోకు రూ.21.05 చొప్పున చెల్లింపుకు పాట దక్కించుకున్నారు. ఇక నూనె డబ్బాలను పిఠాపురానికి చెందిన చిన్న అప్పారావు డబ్బా ఒక్కింటికి రూ. 25–25లు చెల్లించేలా పాట దక్కించుకున్నారు. టెండర్ పక్రియలో లీజెస్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రక్తదానంతో ప్రాణాలు కాపాడవచ్చు
ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్రెడ్డి
ఎయిర్పోర్ట్(గన్నవరం):సమాజంలో రక్తదాన ఆవశ్యకతను ప్రతిఒక్కరు గుర్తించాలని విజయవాడ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎల్. లక్ష్మీకాంత్రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక విమానాశ్రయంలో సోమవారం ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. తొలుత శిబిరాన్ని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ప్రారంభిచడంతో పాటు స్వయంగా ఆయన రక్తదానం చేసి మిగిలిన ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా అపదలో ఉన్న మరొకరి ప్రాణాలను కాపాడవచ్చని చెప్పారు. రక్తదానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని సొసైటీ జిల్లా చైర్మన్ బాలాజీ తెలిపారు. ముఖ్యంగా రక్తదానం చేసేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకురావాలని కోరారు. మొత్తం 33 మంది ఎయిర్పోర్ట్ ఉద్యోగులు రక్తదానం చేసినట్లు సొసైటీ జిల్లా కార్యదర్శి భవిరి శంకర్నాథ్ తెలిపారు. ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్ కార్యదర్శి శ్రీహరి, సొసైటీ కోశాధికారి కె.రామ్బాలాజీ, గన్నవరం శాఖ చైర్మన్ చిన్ని మాధవి, రెడ్క్రాస్ ప్రతినిధులు డాక్టర్ ఎం.విజయకుమార్, ఎం. ప్రభాకరచౌదరి, డాక్టర్ అంజనీకుమార్, హరికృష్ణ తదితరులు
పాల్గొన్నారు.

వడి బియ్యంకు కిలో రూ.21.05