19న యోగాసన, చిత్రలేఖన పోటీలు | - | Sakshi
Sakshi News home page

19న యోగాసన, చిత్రలేఖన పోటీలు

Jun 17 2025 6:53 AM | Updated on Jun 17 2025 6:53 AM

19న యోగాసన, చిత్రలేఖన పోటీలు

19న యోగాసన, చిత్రలేఖన పోటీలు

విజయవాడస్పోర్ట్స్‌: 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 19వ తేదీన ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి యోగాసన పోటీలు, యోగాసనాలపై చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా యోగాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎల్‌.మురళీకృష్ణ తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ చేతుల మీదుగా కలెక్టరేట్‌లో సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతుందన్నారు. ఈ మేరకు సర్వోదయ ట్రస్ట్‌, కృష్ణా జిల్లా యోగాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌, డ్రీమ్‌ యంగ్‌ అండ్‌ చిల్డ్రన్స్‌ ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గవర్నర్‌ పేటలోని బందర్‌ లాకులు వద్ద ఉన్న సర్వోదయ ట్రస్ట్‌, కృష్ణా జిల్లా స్వాతంత్ర సమరయోధుల సంఘ భవనంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆ రోజు ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు యోగాసనా పోటీలు, పది నుంచి 12:00 వరకు చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు. పోటీల్లో పాల్గొనాలని ఆసక్తి ఉన్న వారు 9441119909(యోగా), 9502944913 (చిత్రలేఖనం) నంబర్లను సంప్రదించి ముందస్తుగా పేర్లు రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించారు. ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించడంతోపాటు పాల్గొన్న వారికి పార్టిసిపేషన్‌, మెరిట్‌ సర్టిఫికెట్లు అందజేస్తామని వివరించారు. బ్రోచర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో సర్వోదయ ట్రస్ట్‌ అధ్యక్షులు డాక్టర్‌ జి.వి.మోహన్‌ ప్రసాద్‌, కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement