
ఫణికుమార్ మృతదేహం లభ్యం
శ్రీకాకుళం(ఘంటసాల):కుటుంబానికి ఆసరాగా ఉంటున్న ఒక్కగానొక్క కుమారుడు కృష్ణానదిలో గల్లంతుకాగా సోమవారం లభ్యమైన మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, గ్రామస్తులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఘంటసాల మండలం శ్రీకాకుళం కృష్ణానదిలో గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్న ఆత్కూరి ఫణి కుమార్ ఆదివారం బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తూ కృష్ణానదిలో పడి గల్లంతయ్యాడు. ఎస్ఐ కె.ప్రతాప్ రెడ్డి ఎస్ఆర్డీఎఫ్ బృందాలతో కృష్ణానదిని జల్లెడపట్టగా సోమవారం సాయంత్రంఫణి కుమార్ మృతదేహం లభ్యమైంది. మృతుని భౌతికకాయాన్ని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఒడ్డుకు చేర్చగా తహసీల్దార్ బి.విజయ ప్రసాద్ పర్యవేక్షణలో వీఆర్వో డి.గోపి పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతుడు తండ్రి ధర్మరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.

ఫణికుమార్ మృతదేహం లభ్యం