జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజ న ఆదర్శ క్రీడా పాఠశాల విద్యార్థినులు జాతీ య స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికై న ట్లు పీడీ మీనారెడ్డి, కోచ్ అరవింద్ శనివారం తెలిపారు. ఇటీవల నిర్వహించిన అండర్–17 రాష్ట్రస్థాయి పోటీల్లో అమూల్య, పల్లవి, కవిత ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ నెల 19నుంచి 23 వ తేదీ వరకు గుజరాత్లోని సోమనాథ్లో ని ర్వహించనున్న ఎస్జీఎఫ్ అండర్–17 జాతీ య స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినులను డీటీడీవో రమాదేవి అభినందించారు.


