
అటవీ కార్యాలయంలో రక్తదాన శిబిరం
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మంలోని జిల్లా అటవీ కార్యాలయంలో శనివారం రక్తదాన శిబరం నిర్వహించారు. తలసేమియా బాధితుల కోసం డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రంసింగ్ ఆధ్వర్యాన ఈ శిబిరం ఏర్పాటుచేయగా డీఎంహెచ్ఓ బి.కళావతిబాయి మాట్లాడారు. ఆరోగ్యంగా ఉన్న 18–65 ఏళ్ల మధ్య వయస్సు వారంతా రక్తదానం చేయొచ్చని, తద్వారా తలసేమియా బాధితులతో పాటు ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నట్లవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డీఎఫ్ఓ హరిప్రసాద్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ చందూనాయక్, డాక్టర్ నారాయణమూర్తి, సంకల్ప స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకులు ప్రొద్దుటూరి అనిత, రవిచందర్ తదితరులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 15వరకు
ఇన్స్పైర్ దరఖాస్తులు
ఖమ్మం సహకారనగర్: ప్రస్తుత విద్యాసంవత్సరానికి గాను మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్స్పైర్ అవా ర్డు స్కీమ్(ఈ–ఎంఐఏఎస్) సిస్టమ్ ద్వారా ఆన్లైన్ నామినేషన్లు సెప్టెంబర్ 15వ తేదీ వరకు స్వీకరిస్తామని డీఈఓ సామినేని సత్యనారాయణ తెలిపారు. పాఠశాల స్థాయి విద్యార్థుల్లో మేధస్సు పదును పెట్టడానికి, వారిలో వినూ త్న ఆలోచనల ద్వారా నూతన ఆవిష్కరణలు వెలికితీయడంతో పాటు సమాజంలో అపరి ష్కృత సమస్యల పరిష్కారానికి ఇన్స్పైర్ మానక్ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈమేరకు కు www. inspireawards-dst. gov.in ద్వారా 6నుంచి 12 తరగతుల విద్యార్థులతో ఉత్తమ ఆలోచనలను దరఖాస్తు చేయించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారి(94403 54528)ని సంప్రదించాలని డీఈఓ తెలిపారు.
రూ.1.62కోట్లు కొల్లగొట్టిన కేసులో ఇంకొకరి అరెస్టు
ఖమ్మం క్రైం: ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించి సుమారు రూ.1.62 కోట్ల మేర మోసం చేసిన కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. బోనకల్ మండలానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఫోన్ చేసిన ముఠా సభ్యులు దితులు అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి వాట్సప్, ట్రేడింగ్ లింక్ల ద్వారా సుమారు రూ.1.62 కోట్లు జమ చేయించారు. ఆతర్వాత ముఖం చాటేయడంతో మోసపోయిన గుర్తించిన బాధితుడు ఖమ్మం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో డబ్బు జమ అయిన అకౌంట్ ఆధారంగా ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేయగా, నేనావత్ అఖిల్ను నాగర్కర్నూల్ జిల్లాలో అరెస్టు చేసి ఖమ్మం సైబర్ క్రైం కోర్టులో హాజరుపర్చాక రిమాండ్కు తరలించినట్లు సీపీ తెలిపారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన సైబర్ క్రైం డీఎస్పీ ఫణీందర్, ఎస్సైలు రంజిత్కుమార్, విజయ్కుమార్, సిబ్బందిని ిసీపీ అభినందించారు.
విద్యార్థులపై శ్రద్ధ చూపాలి
పాల్వంచరూరల్: విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, పోస్ట్మెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో సోమవారం నాటికి వందశాతం హాజరు ఉండాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదేశించారు. పాల్వంచలోని గిరిజన బాలికల పోస్టు మెట్రిక్ వసతి గృహం, బాలుర ఆశ్రమ పాఠశాలను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలలకు చేరుకునేలా హెచ్ఎంలు, వార్డెన్లు చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని, పిల్లలకు రక్షిత తాగునీరు అందించాలని చెప్పారు. నూతన మెనూ ప్రకారం ఆహారం అందించాలని ఆదేశించారు. అలాగే, విద్యార్థుల ఆరోగ్యం విషయంలో వార్డెన్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పీఓ ఈ సందర్భంగా సూచించారు.