
బీమా చెక్కు అందజేత
వైరా: వైరా మున్సిపాలిటీలోని శాంతినగర్కు చెందిన ఎక్కిరాల వెంకటేశ్వర్లు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఆయనకు బీఆర్ఎస్పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉండటంతో ఆయన కుటుంబానికి మంజూరైన రూ.2 లక్షల చెక్కును వైరా మాజీ ఎమ్మెల్యే దివంగత బానోత్ మదన్లాల్ సతీమణి మంజుల చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో వైరా మాజీ వైస్ ఎంపీపీ జ్యోతి, నాయకులు వెంకటేశ్వరరావు, కిరణ్, సురేష్, రాము, కిషోర్, ప్రేమ్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మదర్థెరిస్సా కళాశాలలో ప్లేస్మెంట్ డ్రైవ్
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మదర్థెరిస్సా ఫార్మసీ కళాశాలలో శనివారం అపోలో ఫార్మసీ ఆధ్వర్యాన క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో 35మంది విద్యార్థులు ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చల్లా శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎంపికై న విద్యార్థులను కళాశాల చైర్మన్ కంచర్ల సత్యనారాయణ, కళాశాల కరస్పాండెంట్ చలసాని సాంబశివరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కుమార్రాజా, ఐక్యూ కోఆ ర్డినేటర్ డాక్టర్ దాసరి ప్రవీణ్కుమార్, ఇన్చార్జ్ గంటా మానస, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
నడవాలంటే నరకమే..
– అధ్వానంగా మారిన సాగర్ కాల్వ బ్రిడ్జి రోడ్డు
కల్లూరురూరల్: సాగర్కాల్వ బ్రిడ్జిపై నిర్మించిన రోడ్డుపై ప్రజలు ప్రయాణించాలంటే నరకయాతన పడాల్సి వస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. కప్పల బంధంలోని సాగర్ ప్రధాన కాలువపై నిర్మించిన బ్రిడ్జిపై రోడ్డు గుంటలు పడి నీరు నిల్వ ఉండడంతో దానిపై వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీరామాపురం, ఎన్నెస్పీ కల్లూరు వెళ్లేందుకు ఈ బిడ్జియే ప్రధాన మార్గం కావడంతో ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులు చెప్పలేనివి. కొత్త రోడ్డు దేవుడెరుగు ఉన్న రోడ్డుకై నా మరమ్మతులు చేయించి రాకాపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
అధిక ఫీజులు వసూలు చేయొద్దు..
బోనకల్: ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని ఎంఈఓ దామాల పుల్లయ్య అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనుమతి లేని పాఠశాలల్లో పిల్లలను చేర్పించవద్దని, ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల వసతులు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

బీమా చెక్కు అందజేత

బీమా చెక్కు అందజేత

బీమా చెక్కు అందజేత