
రేపటి నుంచి మిర్చి కొనుగోళ్లు
మధిర: మధిర వ్యవసాయ మార్కెట్లో సోమవారం మిర్చి కొనుగోళ్లు ప్రారంభమవుతాయని మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ రబీలో రైతులు సాగు చేసిన ధాన్యాన్ని స్వయం సహాయక సంఘాల ద్వారా కొనుగోలు చేశారని పేర్కొన్నారు. మూడు మండలాల్లో 1,035 మంది రైతుల వద్ద 51,207 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, మద్దతు ధర రూ.12 కోట్లతో పాటు సన్నధాన్యానికి బోనస్ కూడా ఖాతాల్లో జమ అయిందని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు సహకారంతో మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ వైస్ చైర్మన్ ఐలూరి సత్యనారాయణరెడ్డి, డైరెక్టర్ అద్దంకి రవికుమార్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.