
ఘనంగా రామాలయం వార్షికోత్సవం
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లిలోని శ్రీకోదండ రామాలయం 51వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూలమూర్తులకు అభిషేక మహోత్సవం, పుష్పాలంకరణ, పట్టాభిషేక ఉత్సవం పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు అనుమోలు సురేష్, కొత్తూరు సత్యనారాయణ, మొరిశెట్టి సాంబశివగుప్తా, భక్తులు పాల్గొన్నారు.
సెంట్రల్ డీఎస్పీగా
మేకలతండా యువకుడు
కారేపల్లి: మండలంలోని మేకలతండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు బానోత్ రామ్మూర్తి నాయక్ – విజయ దంపతుల కుమారుడు బానోత్ లక్ష్మీవరప్రసాద్ సెంట్రల్ డీఎస్పీ పోస్టుకు ఎంపికయ్యారు. యూపీఎస్సీ నిర్వహించిన సీఏపీఎఫ్ ఎక్జామ్లో 256వ ర్యాంక్ సాధించి సీఏపీఎఫ్ సెంట్రల్ డీఎస్పీగా సెలెక్ట్ అయ్యారు. దీంతో యువకుడి ని మండల ప్రజలు అభినందించారు.
పోరాటాలతోనే
సమస్యల పరిష్కారం
తల్లాడ: పోరాటం ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవచ్చని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. శనివారం తల్లాడలోని కుర్నవల్లి ఫంక్షన్హాల్లో నిర్వహించిన సీపీఎం సత్తుపల్లి డివిజన్ రాజకీయ శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ శిక్షణా తరగతులకు ప్రిన్సిపాల్గా సత్తుపల్లి డివిజన్ సీపీఎం కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి వ్యవహరించగా.. రాజకీయాలు వాటి ఆవశ్యకతపై జన విజ్ఞాన వేదిక రాష్ట్ర బాద్యుడు మల్లెంపాటి వీరభద్రరావు బోదించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మాచర్ల బారతి, జిల్లా కమిటీ సభ్యులు రమేష్, విఠల్, పాండురంగారావు, రామలింగేశ్వరరావు, కృష్ణార్జున్రావు, సర్వేశ్వరరావు పాల్గొన్నారు.
మున్నూరు కాపు కార్పొరేషన్ కోసం కృషి చేస్తా
వైరా: మున్నూరు కాపు కుల కార్పొరేషన్ ఏర్పాటు కోసం తన వంతు కృషి చేస్తానని టీపీసీసీ కార్యదర్శిగా నియమితుడైన కట్ల రంగారావు అన్నారు. శనివారం వైరాలోని 12వ వార్డు రేచర్ల బజార్లో మున్నూరు కాపు కుల సంఘం ఆధ్వర్యంలో కట్ల రంగారావుకు ఘన సన్మానం చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, రేచర్ల నాగేశ్వరరావు, రాముడు, కట్ల నాగరాజు, కామిశెట్టి రవికుమార్, కట్ల సంతోష్, కుటుంబరావు, నాగేంద్రరావు, పుల్లయ్య, సీతారాములు, మహేష్, శ్రీకాంత్, అక్కిశెట్టి రవితేజ, సైదులు సత్యం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రామాలయం వార్షికోత్సవం