
ఎందుకీ అసంతృప్తి?
2022లో ప్రారంభం
ఖమ్మంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల 2022 మార్చిలో ఏర్పాటైంది. నూతన భవనాల నిర్మాణం కోసం రూ. 166 కోట్లతో పాటు 30 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణతో కలిపి 21.31 ఎకరాలు, పాత కలెక్టరేట్ ఆవరణ 5.23 ఎకరాలు, ఆర్అండ్బీ కార్యాలయం 3.09 ఎకరాలను అప్పట్లో కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రికి అనుసంధానంగా పాత కలెక్టరేట్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేలా భవనాల ఆధునికీకరణ, మరమ్మతులకు తొలుత ప్రభుత్వం రూ.8.05 కోట్లు మంజూరు చేసింది. దీంతో చకచకా పనులు చేపట్టిన కళాశాలను అందుబాటులోకి తీసుకురాగా 100 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ఎన్ఎంసీ అనుమతులు జారీ చేసింది. దీంతో 2023 ఆగస్టులో తొలిఏడాది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించి సెప్టెంబర్లో తరగతులు ప్రారంభించారు. అలాగే గత ఏడాది కూడా భర్తీ చేయగా ప్రస్తుతం మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు కలిపి 200 మంది చదువుతున్నారు. ఇప్పుడు మూడో ఏడాదికి అనుమతి జారీ చేయాల్సి ఉండగా, ఎన్ఎంసీ బృందం తనిఖీలు చేపట్టింది.
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్వహణపై జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. 2025–26 ఏడాదికి ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు కోసం రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ఇటీవల తనిఖీ చేయగా.. 26 ప్రభుత్వ కళాశాలల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ జాబితాలో ఖమ్మం కాలేజీ ఉండడం చర్చనీయాంశంగా మారింది. ప్రతీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ముందు నేషనల్ మెడికల్ బృందం తనిఖీ చేయడం ఆనవా యితీ. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతులు, అధ్యాపకులు, ఆధార్తో బయోమెట్రిక్ హాజరు నమోదు, అనుబంధ ఆస్పత్రిలో చికిత్స, వైద్య పరికరాలను పరిశీలించి సంతృప్తి చెందితే అనుమతులు జారీ చేస్తారు. ఇందులో భాగంగా వచ్చే విద్యాసంవంత్సరానికి గాను ఎన్ఎంసీ బృందం ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తనిఖీ చేపట్టగా, ఇక్కడి సదుపాయాలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్నా...
ఖమ్మంలో ఏర్పాటైన ప్రభుత్వ మెడికల్ కళాశాల రాష్ట్ర స్ధాయిలో గుర్తింపు సాధించింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఏ జిల్లాలో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి విశాలమైన భవనాలు, సమీపాన జిల్లా జనరల్ ఆస్పత్రి ఎక్కడా లేవు. ఖమ్మం నడిబొడ్డున సుమారు 30 ఎకరాల్లో కళాశాల ఏర్పాటుచేయడం విశేషంగా చెబుతారు. అలాగే, అనుబంధంగా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి సైతం రాష్ట్ర స్ధాయిలో గుర్తింపు ఉంది. సుమారు 500 పడకలు ఉండగా, నిత్యం 1,500 మంది నుండి 2వేల మంది చికిత్స కోసం వస్తుంటారు. అలాగే, ఆస్పత్రి ఆవరణలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రసవాలు అత్యధికంగా జరుగుతున్నాయి. కళాశాలకు అనుసంధానంగా ఇంత పెద్ద ఆస్పత్రి ఉండడంతో విద్యార్థులకు బోధన సాఫీగా సాగుతుండగా.. మెడికల్ కాలేజీలోనూ అధ్యాపకులు సరిపడా ఉన్నారు. అలాగే, ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు నమోదు, సీసీ కెమెరాలు, చికిత్సపై అవగాహన పెంచుకునేలా ఆస్పత్రిలో రోగులు, అవసరానికి మించి మృతదేహాలు ఉన్నాయి. అంతేకాక తొలి ఏడాది ఎంబీబీఎస్ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించగా, గత ఏడాది ఈ కళాశాలలో చేరేందుకు మెరిట్ ర్యాంకర్లు ఆసక్తి కనబరిచారు. అయినప్పటికీ ఎన్ఎంసీ బృందం ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేసిందో తెలియడం లేదని అధ్యాపకులు చెబుతున్నారు. అయితే, తుదిదశలో మరో మారు తనిఖీ చేయనున్నందున బృందం చేసిన సూచనల మేరకు సరిచేస్తే అనుమతులు జారీ చేసే అవకాశముందని తెలుస్తోంది.
అనుమతి తప్పక వస్తుంది..
మూడో ఏడాది ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ఎన్ఎంసీ నుంనుండి తప్పక అనుమతి వస్తుందనే నమ్మకముంది. రాష్ట్ర స్థాయిలోనే ఖమ్మం కళాశాలకు
మంచి గుర్తింపు ఉంది. నిబంధనల మేరకు విశాలమైన భవనం, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో పాటు బాలుర, బాలికలకు హాస్టళ్లు, ఇతర వసతులు కల్పించాం. అయితే, అప్డేట్ అయిన వాటిని ఎన్ఎంసీ బృందం పరిశీలించనందున హైదరాబాద్ వెళ్లి డీఎంఈకి వివరించా. అందుకే అనుమతులపై ఆందోళన చెందాల్సిన పనిలేదు.
– సుంకర రాజేశ్వరరావు, కాలేజీ ప్రిన్సిపాల్
ఖమ్మం మెడికల్ కాలేజీలో ఎన్ఎంసీ బృందం తనిఖీ
సౌకర్యాలు, వసతులపై పెదవి విరుపు
తుది తనిఖీకి వచ్చేలోగా సరిచేయాలని సూచనలు
కాలేజీలో మూడో ఏడాది
అనుమతులపై సందిగ్ధత

ఎందుకీ అసంతృప్తి?