వనరుల వినియోగంతోనే జిల్లా అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

వనరుల వినియోగంతోనే జిల్లా అభివృద్ధి

Jan 29 2026 6:35 AM | Updated on Jan 29 2026 6:35 AM

వనరుల వినియోగంతోనే జిల్లా అభివృద్ధి

వనరుల వినియోగంతోనే జిల్లా అభివృద్ధి

హొసపేటె: మానవ వనరుల వినియోగంతోనే జిల్లా అభివృద్ధి సాధ్యమని, ఇందుకోసం ఫిబ్రవరి 10 నాటికి జిల్లా సమగ్ర నివేదికను సమర్పించాలని జిల్లాధికారిణి కవిత ఎస్‌.మన్నికేరి తెలిపారు. బుధవారం నగరంలోని జిల్లాధికారిణి కార్యాలయ ఆడిటోరియంలో మానవ అభివృద్ధి నివేదిక, సమగ్ర, స్థిరమైన జిల్లా అభివృద్ధి ప్రణాళిక నివేదికల తయారీపై నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ సదస్సును ఆమె ప్రారంభించి మాట్లాడారు. రాబోయే రోజులో జిల్లా అభివృద్ధికి తగిన విద్య, మానవ అభివృద్ధి, తలసరి ఆదాయం వంటి అన్ని అంశాలతో సహా కచ్చితమైన సమాచారాన్ని అందించాలి. అధికారులు అందించే డేటా ఆధారంగా ఈ ప్రణాళికను అమలు చేస్తారు. అందువల్ల భవిష్యత్తులో ఈ ప్రణాళిక అమలులో ఎటువంటి గందరగోళం లేదా సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించాలి. ఈ విషయంలో అధికారులందరూ సమన్వయంతో పని చేసి అనుబంధ నివేదికను తయారు చేసి జూన్‌ నెలాఖరు నాటికి సమర్పించాలని ఆయన అన్నారు. జెడ్పీ సీఈఓ నోంగ్‌జోయ్‌ మహ్మద్‌ అలీ అక్రమ్‌ షా, ఏఎస్పీ మంజునాథ్‌, కన్నడ వర్సిటీ సోషల్‌ సైన్సెస్‌ ఫ్యాక్టరీ డీన్‌ హెచ్‌డీ ప్రశాంత్‌, డాక్టర్‌ జీఎన్‌ గణేష్‌ ప్రసాద్‌, టెక్‌ ఏజెన్సీ, జిల్లా నోడల్‌ అధికారి నారాయణ్‌ శాస్త్రితో పాటు అనేక శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement