
శాంతికి చిహ్నం రంజాన్
చెళ్లకెరె రూరల్: ముస్లిం బాంధవులు నెలంతా భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు జరిపి పండుగను ఆచరించడం సంతోషదాయకం అని ఎమ్మెల్యే టి.రఘుమూర్తి తెలిపారు. ఆయన బెంగళూరు రోడ్డులోని ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనల్లో పాల్గొని మాట్లాడారు. ముస్లిం సమాజ గురువు నూర్ ఉద్దీన్ మౌలాన్ రంజాన్ పండుగ విశేషతను తెలిపారు. అనంతరం ముస్లిం బాంధవులు శుభాంకాక్షలు తెలుపుకున్నారు. నగరసభ అధ్యక్షురాలు మంజుల ప్రసన్నకుమార్, ఉపాధ్యక్షురాలు ఉమా భరమయ్య, నగరసభ సభ్యులు పాల్గొన్నారు.

శాంతికి చిహ్నం రంజాన్