హాస్టళ్లు ఘనం.. నిర్వహణ అధ్వానం | - | Sakshi
Sakshi News home page

హాస్టళ్లు ఘనం.. నిర్వహణ అధ్వానం

Jun 20 2025 6:27 AM | Updated on Jun 20 2025 6:27 AM

హాస్ట

హాస్టళ్లు ఘనం.. నిర్వహణ అధ్వానం

రాయచూరు రూరల్‌: కళ్యాణ కర్ణాటకలో సాంఘీక సంక్షేమ, వెనుక బడిన వర్గాల శాఖల ఆధీనంలో పని చేసే హాస్టళ్ల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సాంఘీక సంక్షేమ, వెనుక బడిన వర్గాల, వృత్తిపరమైన సంక్షేమ హాస్టళ్లలో రోజురోజుకు అవినీతి మితిమీరి పోవడంతో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. కళ్యాణ కర్ణాటక పరిధిలోని కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బీదర్‌, బళ్లారి, విజయ నగర జిల్లాల ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, కింది స్థాయి ఉద్యోగుల అక్రమార్జన ఫలితంగా సాంఘీక సంక్షేమ హాస్టళ్ల పనితీరు నిరాశాజనకంగా మారుతోంది. కళ్యాణ కర్ణాటకలో వెనుక బడిన వర్గాల హాస్టళ్లు 450, సాంఘీక సంక్షేమ హాస్టళ్లు 550, షెడ్యూల్డ్‌ తెగల హాస్టళ్లు 100, రాయచూరు జిల్లాలో వెనుక బడిన వర్గాల హాస్టళ్లు 90, సాంఘీక సంక్షేమ హాస్టళ్లు 110, షెడ్యూల్డ్‌ తెగల హాస్టళ్లు 25కు పైగా ఉన్నాయి. విద్యార్థులకు తగ్గట్టు హాస్టళ్లలో భోజనాలు వడ్డించక పోవడం, కనీస వసతులు కల్పించడంలో వార్డెన్లు, సిబ్బంది దృష్టి కేంద్రీకరించడం లేదు. ఫలితంగా విధి లేని పరిస్థితులో విద్యార్థులు కాలాన్ని వెళ్లదీయాల్సిన పరిస్థితి దాపురించింది. విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. హాస్టల్‌ నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో ఊహించుకోవచ్చు.

అపరిశుభ్రతకు నిలయాలుగా..

జిల్లా కేంద్రంలోనే దారుణ పరిస్థితి ఉంటే గ్రామీణ ప్రాంతాల్లోని హాస్టళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఇక వేరే చెప్పనక్కర్లేదు. హాస్టళ్ల పనితీరుపై పర్యవేక్షణ లోపం వల్లే నేడు ఈ పరిస్థితికి దిగజారాయి. హాస్టళ్లలో పారిశుధ్యం కొరవడటం, అపరిశుభ్రతకు నిలయాలుగా మారాయి. ఉన్నతాధికారులు వీటిని తూతూ మంత్రంగా తనిఖీ చేస్తుండడంతో వార్డెన్లు, సిబ్బంది అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో హాస్టల్‌ వార్డెన్లు వారానికోసారి దర్శనం చేస్తారు. హాస్టళ్లలో వాచ్‌మ్యాన్‌ వంట మనిషిగా నియమితులవుతున్న సిబ్బంది తమ విధులను ఇతరుల ద్వారా విధులు నిర్వహిస్తూ దర్జాగా తిరుగుతున్నారు. జిల్లాలో విద్యార్థులు అనారోగ్యానికి గురవడం సర్వసాధారణమైంది. వారం రోజుల క్రితం లింగసూగూరు, సింధనూరు, రాయచూరు హాస్టళ్లలో వార్డెన్లు విద్యార్థులకు భోజనం పెట్టకుండా మూడు రోజుల పాటు బయటే ఉంచిన ఘటన నెలకొంది. ఈ విషయంలో జిల్లా స్థాయి అధికారులు మౌనం వహించడం తగదని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. హాస్టల్‌లో కనీస సౌకర్యాలు మెరుగు పరచడంతో పాటు అక్రమార్జనకు అలవాటు పడ్డ వార్డెన్లు, సిబ్బందిపై చర్యలు చేపటాల్సినఅవసరం ఉంది.

ఆందోళనకరంగా వసతిగృహాల

దుస్థితి

శాపంగా అధికారుల పర్యవేక్షణ

లోపం

హాస్టళ్లు ఘనం.. నిర్వహణ అధ్వానం 1
1/2

హాస్టళ్లు ఘనం.. నిర్వహణ అధ్వానం

హాస్టళ్లు ఘనం.. నిర్వహణ అధ్వానం 2
2/2

హాస్టళ్లు ఘనం.. నిర్వహణ అధ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement