హైవే సహాయకుల సేవలు భేష్‌ | - | Sakshi
Sakshi News home page

హైవే సహాయకుల సేవలు భేష్‌

Jun 20 2025 6:27 AM | Updated on Jun 20 2025 6:27 AM

హైవే

హైవే సహాయకుల సేవలు భేష్‌

హొసపేటె: జాతీయ రహదారి– 50లో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా హైవే సహాయకులు, అంబులెన్స్‌ డ్రైవర్లు అందిస్తున్న సేవలు విశిష్టమైనవని విజయనగర జిల్లా ఎస్పీ శ్రీహరిబాబు అన్నారు. విజయనగర జిల్లా పోలీసులు, కూడ్లిగి సబ్‌ డివిజన్‌ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని పర్యాటక మందిరంలో హైవే సహాయకులు, అంబులెన్స్‌ డ్రైవర్ల కోసం నిర్వహించిన హైవే భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. గత మూడేళ్లలో జాతీయ రహదారిపై ప్రమాదాల సంఖ్య 17 శాతం తగ్గిందన్నారు. ప్రమాదాలు యాదృచ్ఛికంగా జరుగుతాయన్నారు. చాలా ప్రమాదాల్లో జాతీయ రహదారిపై సహాయకుల సహాయంతో ప్రజలు మృత్యువు బారి నుంచి తప్పించుకున్నారు. హైవే సహాయకులు నిస్వార్థంగా రాత్రింబవళ్లు సహాయ హస్తం అందిస్తున్నారు. ఈ సహాయకులు పోలీసులకు, ఆరోగ్య శాఖకు ఎస్కార్ట్‌గా సేవలందిస్తుండటం ప్రశంసనీయమని ఆయన అన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వాట్సాప్‌ గ్రూప్‌లో సమాచారాన్ని పోస్ట్‌ చేయడం ద్వారా, సహాయక చర్యల్లో అంబులెన్స్‌, ఆస్పత్రికి సమాచారం పంపడం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చన్నారు.

యథేచ్ఛగా నల్లబజారుకు

చౌక బియ్యం

రాయచూరు రూరల్‌: జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దారి తప్పుతున్నాయని, వాటిపై నిఘా ఉంచని అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లాధికారి నితీష్‌ ఒత్తిడి చేశారు. గురువారం జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చౌక దుకాణాల్లో పేదలకు ఉచితంగా అందిస్తున్న బియ్యాన్ని అధిక ధరకు బయట విక్రయిస్తే అలాంటి వారి బియ్యం కార్డులను రద్దు చేస్తామన్నారు. అంత్యోదయ కార్డులకు 14 కేజీలు, జొన్నలు 21 కేజీలు, బియ్యం బీపీఎల్‌ కార్డులకు 2 కేజీల జొన్నలు, 3 కేజీల బియ్యం పంపిణీ చేస్తూ వాటి విక్రయాలకు పాల్పడిన వారిపై క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామన్నారు.

రేపు 200 చోట్ల యోగా

దినోత్సవానికి ఏర్పాట్లు

హుబ్లీ: ముకుంద నగర్‌ పతంజలి వెల్‌నెస్‌ సెంటర్‌లో గురువారం పతంజలి యోగా సమితి కర్ణాటక, పతంజలి వెల్‌నెస్‌ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినం– 2025 సిద్దతా యోగ శిబిరం, యోగా సప్తాహంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్‌ శాఖ పేర్కొన్న విధంగా యోగాసనాల అభ్యాసం చేసిన తర్వాత అంతర్జాతీయ యోగా గురువు భవర్‌లాల్‌ ఆర్య మాట్లాడుతూ కేంద్ర ఆయుష్‌ శాఖ ఈ సారి లక్ష చోట్ల అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరపడానికి ఏర్పాట్లు చేశారన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో 5 వేల చోట్ల పతంజలి ఆధ్వర్యంలో యోగా దినం పాటిస్తాం. ఆ మేరకు జంట నగరాల్లో 200 చోట్ల ఏకకాలంలో యోగా దినం పాటిస్తామన్నారు. పతంజలి వెల్‌నెస్‌ సంస్థ సంస్థాపకుడు రమేష్‌ మాట్లాడుతూ ఉచిత యోగా, ఆరోగ్య సేవలు ఎక్కడ నడిచిన తమ పతంజలి వెల్‌నెస్‌ సంస్థ, ఎండబ్ల్యూయూబీ సంస్థ ఆధ్వర్యంలో అవసరమైన సహాయ సహకరాలు అందిస్తామన్నారు. యోగా చేయడం వల్ల మనసు పరిశుద్ధం అవుతుందన్నారు. సేవ చేయడానికి భగవంతుడు మనకు ఈ మానవ జన్మ ప్రసాదించారన్నారు. లక్ష కోట్ల జీవరావుల్లో మానవుడే సకల రీతుల్లో సేవ చేయడానికి అర్హుడన్నారు. సంస్థ ఆధ్వర్యంలో శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వైభవంగా జరుపుకుందాం. హుబ్లీ ధార్వాడ సంస్థ ప్రజలు ఈ యోగా దినోత్సవంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వామన్‌ శాన్‌బాగ్‌, పూర్ణిమ పంకజ, లక్ష్మీ, రేఖ తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు సత్వరం పరిష్కరించండి

ఆర్థిక సంఘం చైర్మన్‌ సూచన

హొసపేటె: నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ, యూజీడీ సమస్యలను సత్వరం పరిష్కరించాలని 5వ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌ డాక్టర్‌ సి.నారాయణస్వామి అధికారులను ఆదేశించారు. బుధవారం హొసపేటె మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో జరిగిన ఎన్నికై న ప్రతినిధులు, అధికారులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని అన్ని వార్డులకు నిర్ణీత సమయంలోపు తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థను అందించాలన్నారు. తాగునీటి పైపులైన్లను శాసీ్త్రయంగా ఏర్పాటు చేయాలన్నారు. అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రాథమిక సౌకర్యాలను అందించడానికి గ్రాంట్లను సముచితంగా ఉపయోగించాలన్నారు. అనవసరమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం ద్వారా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయవద్దని హెచ్చరించారు. మున్సిపల్‌ అధ్యక్షుడు రూపేష్‌కుమార్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ పరిధిలో నిర్ణీత గడువులోపు తాగునీటిని అందించాలన్నారు. మరి కొన్ని వార్డులకు నీటి సరఫరాకు గ్రాంట్లు ఇవ్వాలన్నారు. అంగన్‌వాడీలు, పాఠశాలలు, కళాశాలల్లో ప్రాథమిక సౌకర్యాల కల్పనకు గ్రాంట్లు అవసరం అన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ సీ.చంద్రప్ప, రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులు మహ్మద్‌ సనావుల్లా, ఆర్‌ఎస్‌ ఫోండే, కన్సల్టెంట్లు సుప్రసన్న, కెంపేగౌడ, ప్రైవేట్‌ కార్యదర్శి యాలక్కిగౌడ, మున్సిపల్‌ కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు రమేష్‌ గుప్తా, స్టాండింగ్‌ కమిటీ అధ్యక్షుడు కిరణ్‌ శంక్రీ, మున్సిపల్‌ కమిషనర్‌ సి.చంద్రప్పతో సహా మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

హైవే సహాయకుల సేవలు భేష్‌ 1
1/1

హైవే సహాయకుల సేవలు భేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement