
చురుగ్గా మెజస్టీరియల్ విచారణ
శివాజీనగర: తొక్కిసలాట వ్యవహారంలో మెజస్టీరియల్ విచారణను బెంగళూరు నగర కలెక్టర్ జగదీశ్ కొనసాగిస్తున్నారు. సాంకేతిక ఆధారాల కోసం గాలిస్తున్నారు. చిన్నస్వామి మైదానం పూర్తి సీసీ కెమెరాల రికార్డులను ఇవ్వాలని నిర్వాహకులకు లేఖ రాశారు. స్టేడియం లోపల, బయట ఉన్న ఫుటేజీలు కావాలని కోరారు. ఇప్పటికే అన్ని సీసీ కెమెరాల వీడియోలను సీఐడీ స్వాధీనం చేసుకొంది. దాంతో సీఐడీతో డీసీ చర్చిస్తున్నారు. చిన్నస్వామి ముందు భాగం రోడ్డులో ఉన్న సుమారు 30కి పైగా కెమెరాల దృశ్యావళిని పరిశీలన జరిపి ఘటన గురించి విశ్లేషణ చేస్తున్నారు. భద్రతా సదుపాయం, పోలీసుల మోహరింపు, జన రద్దీ కదలికల గురించి సమీక్షించారు. 70 మందికి పైగా తొక్కిసలాట, తోసుకోవడం వీడియోలలో కనిపించింది.
ఇటీవల డీసీ ఆఫీసులో మృతుల కుటుంబీకులు, గాయపడినవారు, ప్రత్యక్ష సాక్షులు, కేఎస్సీఏ, ఆర్సీబీ, డీఎన్ఏ, బీబీఎంపీ, పోలీస్ అధికారులు ఇలా సుమారు 70 మందికి నుంచి సాక్ష్యాలను సేకరించి రిపోర్ట్ను తయారు చేస్తున్నారు. విచారణ ఇంకా మిగిలే ఉన్నందున మరో వారం గడువు కావాలని కలెక్టర్ కోరవచ్చని తెలుస్తోంది. 15 రోజులలోగా విచారణను పూర్తిచేసి నివేదికను అందజేయాలని అప్పట్లో సీఎం సిద్దరామయ్య ఆదేశించారు. ఆ గడువు గురువారంతో ముగిసింది.
ఆధారాల కోసం అన్వేషణ
గురువారంతో పూర్తయిన గడువు