డిప్యూటీ సీఎం.. క్షమాపణ చెప్పు బీజేపీ ధర్నా | - | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎం.. క్షమాపణ చెప్పు బీజేపీ ధర్నా

Mar 26 2025 12:47 AM | Updated on Mar 26 2025 8:02 AM

-

మండ్యలో రైతు సంఘం నిరసన

కలబుర్గిలో బీజేపీ ధర్నా

మండ్య: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు వ్యతిరేకంగా మంగళవారం పలు కారణాలతో, పలు జిల్లాలలో నిరసనలు జరిగాయి. మండ్య ప్రజలు చత్రిగలు అని వర్ణించడం శివకుమార్‌కు తగదని, ఆయన మండ్యకు వచ్చి ప్రజల ముందు క్షమాపణలు అడగాలని రైతు సంఘం నేతలు, కార్యకర్తలు మండ్య నగరంలో గొడుగులు పట్టి నిరసన తెలిపారు. సర్‌ ఎం విశ్వేశ్వరయ్య విగ్రహం వద్ద నుంచి ర్యాలీ జరిపారు. రైతు నేతలు పచ్చె నంజుండస్వామి, ఇండువాళ చంద్రశేఖర్‌, కార్యకర్తలు శివకుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన దురహంకారంగా మాట్లాడారని, జిల్లాకు వచ్చి క్షమాపణలు కోరాలని అన్నారు. మరోవైపు డీకే రాజ్యాంగాన్ని కించపరిచేలా మాట్లాడారని బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. కలబుర్గిలో కూడళ్లలో టైర్లు కాల్చి ధర్నా చేశారు.

కాంగ్రెస్‌ నిరసన
బనశంకరి: డిప్యూటీ సీఎం శివకుమార్‌పై కేంద్రమంత్రి జేపీ.నడ్డా, కిరణ్‌రిజిజు పార్లమెంటులో తప్పుడు ఆరోపణలు చేశారని కాంగ్రెస్‌నాయకులు మంగళవారం బెంగళూరులో ధర్నా చేశారు. రాజ్యాంగ రక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. కానీ బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని డీకే. శివకుమార్‌ మార్చాలన్నారని అబద్దపు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement