భర్త కళ్లముందే భార్య దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

భర్త కళ్లముందే భార్య దుర్మరణం

Jun 5 2023 7:10 AM | Updated on Jun 5 2023 7:21 AM

రోడ్డుపై భార్య మృతదేహం వద్ద భర్త   - Sakshi

రోడ్డుపై భార్య మృతదేహం వద్ద భర్త

బనశంకరి: కేఎస్‌ఆర్‌టీసీ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందారు. ఈ ఘటన బెంగళూరు ఉప్పారపేటే ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. హెబ్బాల కెంపాపుర నివాసి లత (55) ఓ ప్రభుత్వ శాఖలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు. ఆదివారం భర్తతో కలిసి స్కూటర్‌లో గాంధీనగరలో షాపింగ్‌కు వెళ్లారు. ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఆనందరావ్‌ సర్కిల్‌ వద్ద కేఎస్‌ఆర్‌టీసీ బస్సు ఢీకొట్టింది.

స్కూటర్‌ వెనుక కూర్చున్న లత కిందపడిపోగా ఆమైపె బస్సు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు. భర్త స్వల్పగాయాలతో బయటపడ్డారు. కళ్ల ముందే భార్య విగతజీవిగా మారడంతో భర్త గుండెలవిసేలా రోదించారు. ఉప్పారపేటే ట్రాఫిక్‌ పోలీసులు చేరుకుని మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవరు, కండక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కారు ఉన్నప్పటికీ స్కూటర్‌లో వెళ్లడమే ఆమె ప్రాణాలను బలిగొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement