రుద్రూర్: రుద్రూర్లో ఓ కూతురు తన తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించి ఆదర్శంగా నిలిచింది. అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటమ్మ (80) అనే వృద్ధురాలికి కూతురు కవిత తప్ప మరెవరూ లేరు. తల్లి ఆరోగ్యం క్షీ ణించడంతో కవిత తన అత్తవారిని ఒప్పించి రెండు నెలలుగా సేవలందించింది. సోమవా రం వెంకటమ్మ మృతి చెందగా స్థానిక సంప్రదాయం ప్రకారం కవిత అంతిమ సంస్కారా లు నిర్వహించింది. మృతదేహాన్ని ఖననం చే సి తల్లికి వీడ్కోలు పలికింది. కూతురు చూపి న మానవత్వం, తల్లిపట్ల ఉన్న మమకారాన్ని గ్రామస్తులు ప్రశంసించారు.


