పెద్దకొడప్గల్(జుక్కల్): మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో సోమవారం భారత్ కిసాన్ సంఘం ఆ ధ్వర్యంలో జొన్నలు కొనుగోలు చేయాలని రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి పండించిన జొన్నలు అకాల వర్షాలకు తడిసిపోతున్నాయని వాపోయారు. వెంటనే జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గంట సేపు రోడ్డుపై బైఠాయించా రు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రాజశేఖర్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి 4 రోజుల్లో కొనుగోలు ప్రక్రియ చేపడతామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.
కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వినతి
లింగంపేట(ఎల్లారెడ్డి): మోతె గ్రామంలో జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సోమవారం మార్కుఫెడ్ డీఎం శశిధర్రెడ్డికి మోతె గ్రామ రైతులు వినతిపత్రం అందజేశారు. రైతులు వజీర్ అశోక్రావు, రాజిరెడ్డి, పందిరి రవి, రమేశ్, సుధాకర్గౌడ్, మహిపాల్రెడ్డి గదితరులు పాల్గొన్నారు.
సదాశివనగర్లో..
సదాశివనగర్(ఎల్లారెడ్డి): జొన్న, మొక్కజొన్న కేంద్రాలను ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు విఠల్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రైతులకు మద్ధతుగా సోమవారం మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యూరియా యాప్ను ఏర్పాటు చేయడం వల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వెంటనే యాప్ను తొలగించాలని డిమాండ్ చేశారు. బీకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ రావు, మండల అధ్యక్షుడు కొప్పుల నర్సారెడ్డి, రైతులు పాల్గొన్నారు.


