ఎల్లారెడ్డిరూరల్: విద్యార్థులు జీవితంలో మంచి ఉద్యోగాన్ని సాధించి స్థిరపడాలని మున్సిపల్ కమిషనర్ మ హేష్కుమార్ ఆకాంక్షించారు. సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఫేర్వెల్ పార్టీ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. డిగ్రీ తరువాత చాలా రంగాలలో ఉద్యోగాలను సాధించవచ్చని చె ప్పారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, అసోసియేట్ ప్రొఫెసర్ శంకరయ్య, వైస్ ప్రిన్సిపల్ చంద్రకాంత్, కళాశాల కమిటీ సభ్యులున్నారు.


