మీకు తెలుసా.. | - | Sakshi
Sakshi News home page

మీకు తెలుసా..

Jan 17 2026 7:33 AM | Updated on Jan 17 2026 7:33 AM

మీకు తెలుసా..

మీకు తెలుసా..

ఫిర్యాదు చేయడానికి ముందు..

వస్తువుల కొనుగోలులో

లోపం ఉంటే..

రామారెడ్డి : వినియోగదారుడు ఒక వస్తువును కొన్నప్పుడు అ ది పాడైపోయినా, నాణ్యత లేకపోయినా, మోసపోయినా భయపడాల్సిన అవసరం లేదు. భార త వినియోగదారుల రక్షణ చట్టం(కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ 2019) ప్రకారం వారికి పూర్తి హక్కులు ఉంటాయి.

కేసు ఎలా వేయాలి.. ఎక్కడ వేయాలన్న విషయాలను తెలుసుకుందాం.

● రసీదు(బిల్‌) కొన్న వస్తువుకు సంబంధించిన ఒరిజినల్‌ బిల్లును భద్రపరచుకోవాలి.

● సంస్థకు ఫిర్యాదు మొదట సదరు కంపెనీ కస్టమర్‌ కేర్‌కు లేదా షాపు యజమానికి రాతపూర్వకమైన ఫిర్యాదు చేయాలి.

● నోటీసుకు వారు స్పందించకపోతే, ఒక లీగల్‌ నోటీసు పంపాలి.

● వస్తువు విలువ లేదా కోరుతున్న పరిహారం ఆధారంగా మూడు స్థాయిల్లో కోర్టులు ఉంటాయి.

● స్థాయి వస్తువు విలువ పరిహారం జిల్లా కమిషన్‌ రూ. 50లక్షల లోపు, రాష్ట్ర కమిషన్‌ రూ. 50 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు ఫిర్యాదు చేయాలి.

● జాతీయ కమిషన్‌ రూ. 2కోట్లకు పైగా నష్టం జరిగితే ఫిర్యాదు చేయాలి.

రెండు రకాలుగా ఫిర్యాదు చేయొచ్చు

● ఆన్‌లైన్‌ ద్వారా వినియోగదారులు ఇంటి నుంచే edaakhil.nic.in వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

● మరొకటి నేరుగా కోర్టులో మీ ప్రాంతంలోని జిల్లా వినియోగదారుల ఫోరమ్‌కు వెళ్లి స్వ యంగా ఫిర్యాదు పత్రాన్ని సమర్పించవచ్చు. దీనికి లాయర్‌ ఉండాల్సిన అవసరం లేదు.

● అవసరమైన పత్రాలు ఫిర్యాదు చేసేటప్పుడు మీ పేరు, చిరునామా అవతలి వ్యక్తి/కంపెనీ వివరాలు, వస్తువు కొన్న బిల్లు వారంటీ/గ్యారెంటీ కార్డు ఉంటే వాటిని సమర్పించాలి

● వస్తువులో ఉన్న లోపానికి సంబంధించిన ఫొటోలు లేదా ఆధారాలు, మీరు కంపెనీకి పంపిన ఈమెయిల్స్‌ లేదా నోటీసుల కాపీలు జతచేయాలి.

● మీకు ఏదైనా సందేహం ఉంటే ప్రభుత్వం ఏ ర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నంబర్‌ 18001 14000 లేదా 1915, ఎస్‌ఎంఎస్‌: 88000 01915 నంబర్‌కు మెసేజ్‌ పంపి సాయం పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement