అవార్డు గ్రహీతకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

అవార్డు గ్రహీతకు సన్మానం

Jun 18 2025 3:21 AM | Updated on Jun 18 2025 3:21 AM

అవార్

అవార్డు గ్రహీతకు సన్మానం

పెర్కిట్‌(ఆర్మూర్‌): ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామానికి చెందిన కొమ్ము వినోద్‌ రెడ్డిని హైదరాబాద్‌లో మంగళవారం టీపీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ ఘనంగా సన్మానించారు. కొమ్ము వినోద్‌ రెడ్డి ఇటీవల వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు, జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులను సొంతం చేసుకున్నాడు. దీంతో మధుయాష్కీ గౌడ్‌ ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు.

లబ్ధిదారులకు మెరుగైన సేవలందించాలి

కామారెడ్డి టౌన్‌: ఆస్పత్రులకు వచ్చే ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందేలా చేయాలని ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా మేనేజర్‌ సత్యనారాయణ ఆరోగ్యశ్రీ మిత్ర, సిబ్బందికి సూచించారు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం ఆరోగ్యశ్రీ సేవలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు నిరంతరం సేవలు అందించేలా చూడాలన్నారు. రిజిస్టర్లను పరిశీలించారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా టీం లీడర్లు అల్లావుద్దీన్‌, యశ్వంత్‌, ఆరోగ్య మిత్రలు పాల్గొన్నారు.

క్రీడాకారులకు అభినందన

సుభాష్‌నగర్‌: హన్మకొండలో ఈ నెల 12 నుంచి 14 వరకు జరిగిన ఇంటర్‌ సర్కిల్‌ విద్యుత్‌ కబడ్డీ, బాల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో తృతీయ స్థానం సాధించిన జిల్లా జట్టు క్రీడాకారులను ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ ఆర్‌ రవీందర్‌ మంగళవారం నగరంలోని పవర్‌ హౌస్‌ మీటింగ్‌ హాల్‌లో అభినందించారు. భవిష్యత్‌లో మొదటిస్థానంలో నిలవాలని, అందుకు అవసరమైన సహకారం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఏడీఈ తోట రాజశేఖర్‌, ఏఏవో గంగారాం, జేఏవో పూదరి గంగాధర్‌, సెక్రటరీ ఏ గోపి, కోశాధికారి వీ ఉత్తమ్‌సింగ్‌, దినేశ్‌, కేఎస్‌ఆర్‌ మూర్తి, కబడ్డీ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

కళాశాల వార్షికోత్సవం

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలోని సాందీపని డిగ్రీ కళాశాల వార్షికోత్సవం మంగళవారం స్థానిక లక్ష్మీదేవి గార్డెన్‌న్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, ఆటపాటలతో వీక్షకులను అలరించారు. కళాశాల డైరెక్టర్లు హరిస్మరణ్‌రెడ్డి, జనార్దన్‌ రెడ్డి, అశోక్‌ రావు, బాలాజీ రావు, రాజేశ్వరరావు, ప్రిన్సిపల్‌ సాయిబాబు, అకాడమిక్‌ ఇన్‌చార్జి మనోజ్‌ కుమార్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ

ఆర్మూర్‌టౌన్‌: ఆర్మూర్‌ పట్టణంలోని గ్యాదరి అరవింద్‌ ఇంట్లో ఈ నెల 16న తెల్లవారుజామున దుండగులు చోరీకి పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆరోగ్యం బాగోలేక పోవడంతో అరవింద్‌ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరాడు. సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా బీరువాలోని సామగ్రి చిందర వందరగా పడి ఉన్నాయి. దుండగులు 16 తులాల బంగారం, రూ. 30 వేల నగదు అపహరించినట్లు బాధితుడు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

అవార్డు గ్రహీతకు సన్మానం
1
1/3

అవార్డు గ్రహీతకు సన్మానం

అవార్డు గ్రహీతకు సన్మానం
2
2/3

అవార్డు గ్రహీతకు సన్మానం

అవార్డు గ్రహీతకు సన్మానం
3
3/3

అవార్డు గ్రహీతకు సన్మానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement