త్రినేత్ర శివలింగం.. ఉమామహేశ్వర ఆలయం | - | Sakshi
Sakshi News home page

త్రినేత్ర శివలింగం.. ఉమామహేశ్వర ఆలయం

Jun 18 2025 3:21 AM | Updated on Jun 18 2025 3:21 AM

త్రినేత్ర శివలింగం.. ఉమామహేశ్వర ఆలయం

త్రినేత్ర శివలింగం.. ఉమామహేశ్వర ఆలయం

మీకు తెలుసా?

నందిపేట మండలం ఉమ్మెడ శివారులో గల గోదావరి నది పరీవాహక ప్రాంతంలో ఉన్న ఉమామహేశ్వర ఆలయం ఎంతో విశిష్టత కలిగి ఉంది.

● త్రేతాయుగంలో శ్రీరాముడు నడిచిన బాటలో గోదావరి నది ఒడ్డున ఇసుతో సైకత లింగాన్ని చేసి శివరూపాన్ని భక్తితో పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

● ఈ శివలింగం ప్రత్యేకతను తెలుసుకొని సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం 10, 11 వ శతాబ్దపు మధ్యకాలంలో కల్యాణ చాళుక్యుల మహారాజైన మహా మండళేశ్వరుడు కట్టించిన దేవాలయమని అని చరిత్ర ద్వారా తెలుస్తుంది.

● ఈ ఆలయంలో శివలింగం మీద త్రినేత్రం కనిపించడం విశేషం.

● దీపగండంగా పిలువబడే 108 దీపాల ధ్వజస్తంభం ప్రత్యేకత.

● పోదశ స్తంభాలతో మండపం. ప్రతి స్తంభం మీద నాగ శాసనాలు, దేవాలయం చుట్టూ దాన శాసనాలు(ప్రతేక లిపితో రాసినవి) కలిగి ఉంటాయి.

● ప్రతి సంవత్సరం వర్షాకాలంలో గోదావరి బ్యాక్‌ వాటర్‌లో నీటమునిగే దేవాలయం, శివరాత్రి సమయంలో బయట పడుతుంది. మూ డురోజులపాటు ఉత్సవాలను నిర్వహిస్తారు.

● నందిపేట మండల కేంద్రానికి 8 కిలో మీటర్ల దూరంలో గోదావరి పరీవాహక ప్రాంతంలో నది ఒడ్డున ఉండడంతో ఈ ఆలయం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

– నందిపేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement